ధృవ హీరో-విలన్ మరోసారి జతగా!!

Update: 2016-12-04 05:03 GMT
ధృవ హీరో అండ్ విలన్ అంటే.. తెలుగు సినిమాలో కాదు లెండి.. ధృవకు తమిళ మాతృక అయిన తని ఒరువన్ లో జయం రవి హీరోగాను.. అరవింద్ స్వామి విలన్ గాను నటించారు. వీరిద్దరి మధ్య నడిచిన యాక్షన్ డ్రామా ఏ రేంజ్ లో హిట్ అయిందంటే.. పెట్టుబడికి ఎన్నో రెట్లు రిటర్న్ రాబట్టింది. అందుకే ఈ కాంబినేషన్ లో మరోసారి మూవీ తీసేశాడు లక్ష్మణ్.

రోమియో జూలియెట్ అంటూ గతేడాది దర్శకుడు లక్షణ్.. హీరోయిన్ హన్సికలతో హిట్ కొట్టిన తర్వాత.. అదే కాంబినేషన్ రిపీట్ చేస్తూ సినిమా స్టార్ట్ చేశాడు జయం రవి. ఆ వెంటనే తని ఒరువన్ బ్లాక్ బస్టర్ కావడంతో.. కీలకమైన పాత్రకు అరవింద్ స్వామినే తీసుకున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ ఆసక్తి కలిగిస్తోంది. ఇద్దరూ ట్రైలర్ లో చాలాసేపు ఫ్రెండ్స్ గానే కనిపిస్తారు. కానీ అరవింద్ స్వామి మాత్రం తనలోని నెగిటివ్ రూపాన్ని తర్వాత రివీల్ చేస్తాడన్న మాట.

ఈ మూవీని కూడా కాప్ డ్రామాగానే తెరకెక్కించగా.. యాక్షన్ సన్నివేశాలే హైలైట్ గా నిలుస్తున్నాయి. మరోవైపు హన్సికతో పాటు అక్షర గౌడ అందాలు బోగన్ కి స్పెషల్ బోనస్ అని చెప్పాలి. డిసెంబర్ 23న విడదల కానున్న ఈ క్రేజీ కాంబినేషన్ మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి.


Full View

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News