వాళ్లు కూడా ఆంటీ అంటే మండదా మరి?

Update: 2020-08-12 01:30 GMT
జబర్దస్త్‌ బ్యూటీ అనసూయ ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఏమాత్రం అందం తగ్గక పోవడంతో పాటు మొదటితో పోల్చితే ఇప్పుడు గ్లామర్‌ డోస్‌ మరింతగా పెంచింది. పెళ్లి కాని రష్మి కంటే కూడా పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్న అనసూయకే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. జబర్దస్త్‌ తో అద్బుతమైన ఫాలోయింగ్‌ ను దక్కించుకున్న అనసూయ తాజాగా సుమతో కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఆ కార్యక్రమంలో ఇద్దరి మద్య సంభాషణ సరదాగా సాగింది. ఆ సమయంలో కొందరు నెటిజన్స్‌ తనను ఆంటీ అంటూ సంబోధించడం చిరాకుగా అనిపిస్తుందని అనసూయ ఆగ్రహం వ్యక్తం చేసింది.

మీసాలు గడ్డాలు వచ్చిన వాళ్లు కూడా నన్ను ఆంటీ అంటూ పిలవడం నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒరేయ్‌ నీ వయసుకు నేను ఆంటీని ఎంట్రా అనాలనిపిస్తుంది. కాని వారికే కనీస జ్ఞానం ఉండాలి కదా అనిపిస్తుంది. నా పిల్లల తోటి వారు నన్ను ఆంటీ అంటే పర్వాలేదు కాని పిల్లలకు తండ్రులు అయిన వారు కూడా ఆంటీ అంటే ఎలా అంటూ సుమ వద్ద ఆసహనం వ్యక్తం చేసింది.

అనసూయ అసహనంకు సుమ తనదైన శైలిలో స్పందించింది. వాళ్లు ఎవరో ఆంటీ అన్నంత మాత్రాన మనం ఆంటీలం అవుతామా. మనం అనుకుంటే అప్పుడు ఆంటీలం అవుతామని కామెడీ చేసింది. గతంలో ఆన్‌ లైన్‌ చాట్‌ సమయంలో కూడా అనసూయ తనను ఆంటీ అంటూ సంభోదించిన వారిపై సీరియస్‌ అయిన విషయం తెల్సిందే. ఏదో ఆకతాయిలు అన్నంత మాత్రాన అంతగా ఉడుక్కోవడం ఎందుకు అనసూయ అంటూ ఆమె అభిమానులు కొందరు సముదాయించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.
Tags:    

Similar News