మెగా వైరంపై మెగా హీరో క్లారిటీ

Update: 2019-05-19 09:23 GMT
చాలా సంవత్సరాలుగా మెగా హీరోలైన రామ్‌ చరణ్‌ - అల్లు అర్జున్‌ ల మద్య విభేదాలున్నాయంటూ ప్రచారం జరుగుతుంది. వీరిద్దరి మద్య డామినేషన్‌ - ఈగో సమస్యలున్నాయంటూ వెబ్‌ మీడియాలో కథలు కథలుగా కథనాలు వచ్చాయి. గతంలో అల్లు అర్జున్‌ ఈ విషయమై స్పందించి కొట్టి పారేశాడు. అయినా కూడా ఇద్దరి మద్య కోల్డ్‌ వార్‌ జరుగుతుందనే ఎక్కువ శాతం నమ్ముతున్నారు. ఇటీవల రామ్‌ చరణ్‌ నటించిన 'రంగస్థలం' చిత్రం పై అందరు స్పందించినా కూడా అల్లు అర్జున్‌ మాత్రం రియాక్ట్‌ అవ్వలేదు. దాంతో చరణ్‌ సక్సెస్‌ కు బన్నీ ఈగో తో ఉన్నాడు అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ వచ్చాయి. మెగా హీరోలు ఎవరి దారిన వారు అన్నట్లుగా ఉన్నారంటూ మీడియాలో వస్తున్న వార్తలపై తాజాగా అల్లు శిరీష్‌ క్లారిటీ ఇచ్చాడు.

అల్లు శిరీష్‌ తాజాగా 'ఏబీసీడీ' చిత్రంతో ప్రేక్షకలు ముందుకు వచ్చాడు. ఆ సినిమా ప్రమోషన్‌ లో భాగంగా అల్లు శిరీష్‌ మాట్లాడుతూ బన్నీ - చరణ్‌ ల మద్య విభేదాల గురించి స్పందించాడు. వారిద్దరు చిన్నప్పటి నుండి కలిసి పెరిగారు ఇప్పటికి కూడా తరచు కలుస్తూనే ఉంటారు. ఎప్పటికప్పుడు మీట్‌ అవుతూ అన్ని విషయాల గురించి చర్చించుకుంటూ ఉంటారు. వారిద్దరి మద్య విభేదాలు అనే విషయంలో ఏమాత్రం నిజం లేదు. వారిద్దరు మాట్లాడుకోరు అనడంలో అర్థం లేదన్నాడు.

కొందరు యూట్యూబ్‌ వ్యూస్‌ కోసం అలాంటి కథనాలు రాస్తున్నారు. అలాంటి వార్తలను అసలు నమ్మవదు - మెగా హీరోలు అంతా కూడా చాలా సఖ్యతతో ఉన్నారు. ఒకరిపై ఒకరు ఈగోతో ఎప్పుడు లేరు. పవన్‌ కళ్యాణ్‌ గారికి మా మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఎన్నికల ప్రచారం సమయంలో బన్నీ మీటింగ్‌ కు వెళ్లి మరీ పవన్‌ గారికి మరియు నాగబాబు గారికి మద్దతు తెలిపాడు. మా మద్య ఎలాంటి విభేదాలు - ఈగోలు లేవు. మేము అంతా కలిసే ఉన్నాము. మీడియాలో వచ్చే పుకార్లను నమ్మనక్కర్లేదంటూ శిరీష్‌ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.




Tags:    

Similar News