Begin typing your search above and press return to search.

ఐపీఎలే ముద్దు... కివీస్ ప్లేయర్స్ ఆసక్తికర నిర్ణయం!

అవును... పాకిస్థాన్ తో జరగనున్న సిరీస్ కంటే తమకు ఐపీఎలే ముఖ్యమని అంటున్నారంట కివీస్ స్టార్ క్రికెటర్లు

By:  Tupaki Desk   |   4 April 2024 3:57 AM GMT
ఐపీఎలే ముద్దు... కివీస్  ప్లేయర్స్  ఆసక్తికర నిర్ణయం!
X

క్రికెట్ పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ టోర్నమెంట్ కి ఉన్న ఆదరణ, వచ్చే ఆదాయం, దొరికే గుర్తింపు అన్నీ పీక్స్ లో ఉంటాయనే చెప్పాలి. అలాంటి ఐపీఎల్ టోర్నమెంట్ లో ఆడుతున్నప్పుడు మరెదీ ముఖ్యం కాదని.. సొంత దేశం మ్యాచ్ లు కూడా సెకండ్ ప్రియారిటీయే అని చాలా మంది ప్లేయర్స్ భావిస్తుంటారని చెబుతుంటారు. ఈ క్రమంలో తాజాగా కివీస్ ప్లేయర్స్ కూడా ఇలానే ఆలోచించారని అంటున్నారు.

అవును... పాకిస్థాన్ తో జరగనున్న సిరీస్ కంటే తమకు ఐపీఎలే ముఖ్యమని అంటున్నారంట కివీస్ స్టార్ క్రికెటర్లు! ఇందులో భాగంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఆడుతున్న న్యూజిలాండ్ క్రికెటర్లు తొమ్మిది మందీ.. ఈ మేరకు తమ దేశ బోర్డుకు ఆ విషయం చెప్పారని తెలుస్తుంది. దీంతో.. ద్వితీయ శ్రేణి ఆటగాళ్లతో కూడిన జట్టును పాకిస్థాన్ సిరీస్ కు ఎంపీక చేసిందంట కివీస్ క్రికెట్ బోర్డు!

వాస్తవానికి ఈ నెల 18 నుంచి పాకిస్థాన్ తో న్యూజిలాండ్ కు 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ ఉంది. దీనికోసం 16 మంది ప్లేయర్స్ తో జట్టును ప్రకటించింది. ఈ జట్టులో... ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, మాట్ హెన్రీ, రచిని రవీంద్ర, కేన్ విలియమ్సన్, గ్లెన్ ఫిలిప్స్ లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ కమిట్మెంట్స్ లో ఉన్నరాని, అందువల్ల పాకిస్థాన్ తో సిరీస్ కు అందుబాటులో లేరని న్యూజిలాండ్ క్రికెట్ అధికారిక ప్రకటనలో తెలిపింది!

కాగా... న్యూజిలాండ్ ప్లేయర్స్ లో డారిల్ మిచెల్, రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే, మిచెల్ సాంట్నర్ లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తుండగా.. కేన్ విలియమ్సన్ – గుజరాత్ టైటాన్స్ జట్టులో ఉన్నాడు. ఇదే క్రమంలో ట్రెంట్ బౌల్ట్ – రాజస్థాన్ రాయల్స్ లో కొనసాగుతుండగా.. లాకీ ఫెర్గూసన్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.. మాట్ హెన్రీ - లక్నో సూపర్ జెయింట్స్.. గ్లెన్ ఫిలిప్స్ - స‌న్‌ రైజ‌ర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న సంగతి తెలిసిందే!