Begin typing your search above and press return to search.

ఐపీఎల్ కు ఓకే.. చీర్ లీడర్స్ కు నాట్ ఓకే?

ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీలో భాగంగా నిలిచిన 17 మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   14 May 2025 4:33 AM
ఐపీఎల్ కు ఓకే.. చీర్ లీడర్స్ కు నాట్ ఓకే?
X

భారత - పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీని అర్ధాంతరంగా ఆపేసిన సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన నేపథ్యంలో ఐపీఎల్ టోర్నీలో భాగంగా నిలిచిన 17 మ్యాచ్ లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 17నుంచి అంటే..ఈ వారాంతం నుంచి ఐపీఎల్ పున: ప్రారంభం కానుంది. ఇలాంటి వేళ.. భారత మాజీ క్రికెటర్ కం వ్యాఖ్యాత సునీల్ గావస్కర్ కీలక సూచన చేశారు.

మళ్లీ ప్రారంభం కానున్న ఐపీఎల్ టోర్నీలో.. ఈసారి వినోద కార్యక్రమాలకు పుల్ స్టాప్ పెట్టాలన్నది ఆయన సూచన. దీనికి ఆయన చెబుతున్న కారణాలు కన్వీన్స్ అయ్యేలా ఉండటమే కాదు.. నిజంగానే బీసీసీఐ కూడా ఈ దిశగా ఆలోచించాలన్న భావన కలిగేలా ఉండటం గమనార్హం. ఇంతకూ సునీల్ గావాస్కర్ ఏమన్నారంటే.. ‘‘పాక్ దురాగతంతో కొన్ని కుటుంబాలు తమ సన్నిహితులను.. ప్రియమైన వారిని కోల్పోయారు. ఆ కుటుంబాలకు గౌరవసూచకంగా ఐపీఎల్ సీజన్ లోని మిగిలిన మ్యాచ్ లను హంగూ.. ఆర్భాటాలు లేకుండా నిర్వహించాలని కోరుకుంటున్నారు. ఈ టోర్నీలోని మిగిలిన మ్యాచ్ లు కేవలం ఆట వరకే పరిమితం కావాలి. ప్రేక్షకుల్ని అనుమతించండి. కానీ.. చీర్ లీడర్స్.. ఓవర్ల మధ్య డీజే పాటు వద్దు. తమ ఆత్మీయుల్ని కోల్పోయిన కుటుంబాలను గౌరవించటం నిజంగా మంచి మార్గం’’ అని పేర్కొన్నారు.

తాజాగా విడుదలై షెడ్యూల్ ప్రకారం మే 17న మొదలయ్యే మ్యాచ్ లు.. ఆరు వేదికల్లో జరగనున్నాయి. రెండు ఆదివారాలు డబుల్ హెడ్డర్ మ్యాచ్ లు ఉంటాయి. బెంగళూరు.. జైపుర్.. ఢిల్లీ.. ముంబయి.. లక్నో.. అహ్మదాబాద్ వేదికల మీద మ్యాచ్ లు జరగనున్నాయి. మే 29న మొదటి క్వాలిఫయర్.. మే 30న ఎలిమినేటర్.. జూన్ 1న రెండో క్వాలిఫయర్.. జూన్ 3న ఫైనల్ నిర్వహించనున్నారు. అయితే.. ఫ్లే ఆప్స్ మ్యాచ్ ల వేదికలు ఇంకా ఖరారు కాని విషయం తెలిసిందే. మొత్తంగా సునీల్ గావాస్కర్ సూచనను పరిగణలోకి తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.