మంగళవారం.. ఐపీఎల్ డబుల్ హెడర్.. అత్యంత అరుదు.. ఎందుకో?
మంగళవారం కోల్ కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మధ్యాహ్నం మ్యాచ్ జరగనుంది. సాయంత్రం పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
By: Tupaki Desk | 8 April 2025 2:06 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అంటేనే మజా మజా లీగ్.. సరదాగా పాప్ కార్న్ తింటూ.. ఎంజాయ్ చేస్తూ చూసే ధనాధన్ క్రికెట్.. అందుకే ఐపీఎల్ డబుల్ హెడర్ (రెండేసి మ్యాచ్ లు)లు ఎక్కువగా సెలవు రోజులైన శని, ఆదివారాల్లో మాత్రమే ఉంటాయి. ఎక్కువశాతం ఆదివారాల్లోనే రెండు మ్యాచ్ లు జరగుతుంటాయి. మూడేళ్ల నుంచి రెండు టీమ్ లు పెరిగినందున శనివారాలు కూడా డబుల్ హెడర్ లు నిర్వహిస్తున్నారు.
మెగా వేలంతో ఈ ఏడాది అనేక నిబంధనలు, మార్పులు, సంచలనాలతో ముందుకొచ్చిన ఐపీఎల్ లో ఓ అనూహ్య మార్పు కూడా చోటుచేసుకుంది. ఎన్నడూ లేనివిధంగా మంగళవారం డబుల్ హెడర్ లు జరగనున్నాయి.
మంగళవారం కోల్ కతా నైట్ రైడర్స్-లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మధ్యాహ్నం మ్యాచ్ జరగనుంది. సాయంత్రం పంజాబ్ కింగ్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.
నాలుగు మ్యాచ్ లు ఆడి రెండు నెగ్గిన కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్), లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ)లు కోల్ కతాలో తలపడనున్నాయి. మూడు మ్యాచ్ లు ఆడి రెండు గెలిచిన పంజాబ్.. నాలుగు మ్యాచ్ లు ఆడి ఒకటే నెగ్గిన చెన్నై జట్లు పంజాబ్ లోని ముల్లాన్ పూర్ లో ఆడనున్నాయి.
మిస్టరీ స్పిన్నర్ల సమరం..
వాస్తవానికి కోల్ కతా-లక్నో మ్యాచ్ ఆదివారమే జరగాల్సి ఉంది. అయితే, శ్రీరామ నవమి కారణంగా రెండు రోజులు వాయిదా వేశారు. ఇక ఈ మ్యాచ్ లో మిస్టరీ స్పిన్నర్ల సమరం అని చెప్పుకోవాలి. కోల్ కతా తురుపుముక్క సునీల్ నరైన్. అతడి తరహాలోనే బౌలింగ్ యాక్షన్ ఈ లీగ్ లో లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రాఠీ ఆకట్టుకుంటున్నాడు. ఇదీ మంగళవారం డబుల్ హెడర్ ల కథ.