Begin typing your search above and press return to search.

పాక్ బోర్డర్ లో గ్రౌండ్..ఎయిర్ పోర్ట్ బంద్.. ఐపీఎల్ జరుగుతుందా?

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసే ఉద్దేశంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

By:  Tupaki Desk   |   7 May 2025 11:47 PM IST
పాక్ బోర్డర్ లో గ్రౌండ్..ఎయిర్ పోర్ట్ బంద్.. ఐపీఎల్ జరుగుతుందా?
X

పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేసే ఉద్దేశంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై దీని ప్రభావం ఉంటుందా? అనే చర్చ కూడా నడుస్తోంది. ఏడు దేశాల క్రీడాకారులు ప్రస్తుతం భారత్ లో ఉన్నారు. తాజా యుద్ధ వాతావరణంపై వీరి భద్రతపై ఆయా దేశాలు ఆందోళన చెందడం ఖాయం. అయితే, ఇప్పటివరకు ఐపీఎల్ షెడ్యూల్ పై ప్రభావం ఏమీ లేదని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

కాకపోతే పాకిస్థాన్ సరిహద్దులో ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితులపై ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరం ఉంది.

ఆపరేషన్ సిందూర్ కారణంగా.. ఉత్తరాది రాష్ట్రాల్లోని జమ్ము, శ్రీనగర్‌, ధర్మశాల, లేహ్‌, అమృత్‌సర్‌, చండీగఢ్‌ సహా పలు ఎయిర్ పోర్టులను కేంద్ర ప్రభుత్వం మూసివేసింది. ఐపీఎల్ మ్యాచ్ లపై దీని ప్రభావం పడుతోంది. వీటిని తెరిచేందుకు కేంద్రం మళ్లీ ఆదేశాలు ఇవ్వనుంది.

చండీగఢ్, ధర్మశాల ఎయిర్ పోర్టులను మూసివేయడమే ఇక్కడ కీలకం. ఈ ప్రాంతాల్లో క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి. వీటిలో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. పంజాబ్ కింగ్స్ తో ధర్మశాలలో ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ నెల 11న జరగనున్న ఈ మ్యాచ్ కోసం గురువారమే ముంబై జట్టు ధర్మశాలకు రావాలి. ధర్మశాలలోని మైదానం పంజాబ్ కింగ్స్ హోం గ్రౌండ్.

ధర్మశాల ఎయిర్ పోర్టుతో పాటు చండీగఢ్ లోనూ ఎయిర్ పోర్టును మూసివేసిన నేపథ్యంలో ముంబై జట్టు వేరే మార్గంలో రావాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆలోచన సాగిస్తున్నట్లు సమాచారం. అంటే.. ముందుగా ఢిల్లీ వచ్చి అక్కడి నుంచి బస్సులో ధర్మశాల వెళ్లాల్సి ఉంటుంది.

మ్యాచ్ ఉంటుందా..?

ధర్మశాలలో ముంబై-పంజాబ్ మ్యాచ్ కంటే ముందే గురువారం ఢిల్లీతో పంజాబ్ ఆడాల్సి ఉంది. కానీ, ధర్మశాల పాకిస్థాన్ సరిహద్దుకు దగ్గరగా ఉండడంతో ఈ మ్యాచ్ జరుగుతుందా? అనేది చూడాలి. దీనిపై కేంద్రంతో బీసీసీఐ సంప్రదింపులు జరుపుతోంది.

పంజాబ్-ముంబై మ్యాచ్ ను ముంబైకి మార్చనున్నట్లు తెలుస్తోంది.