Begin typing your search above and press return to search.

మ‌హేష్ తెలివైన పెట్టుబ‌డి ప్లానింగ్ ఆవిడ‌దేనా?

తాజాగా మ‌హేష్ శంకర్‌పల్లి సమీపంలోని 2.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం నమ్రత శంకర్‌పల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించారు.

By:  Tupaki Desk   |   7 March 2024 8:05 AM GMT
మ‌హేష్ తెలివైన పెట్టుబ‌డి ప్లానింగ్ ఆవిడ‌దేనా?
X

మ‌హేష్ సూప‌ర్ స్టార్ మాత్ర‌మే కాదు..అంత‌కు మించి తెలివైన వ్యాపార వేత్త కూడా. స్టార్ గా కోట్ల రూపాయ లు పారితోషికం తీసుకుంటున్న మ‌హేష్ ఆ మొత్తాన్ని తెలివైన ఇన్వెస్ట్ మెంట్ చేస్తున్నారు. త‌న పారితో షాకాన్నే పెట్టుబ‌డిగా పెట్టి వ‌చ్చిన లాభాల్లో వాటా పొందుతున్నారు. ఎండార్స్ మెట్స్ ద్వారానా కోట్ల రూపాయ‌లు అర్జిస్తున్నారు. ఇక ఏషియ‌న్ గ్రూప్ భాగ‌స్వామ్యంలో నిర్మించిన ఏఎంబీ మాల్ ద్వారా నూ మ‌హేష్ ఏటా మంచి లాభాలు చూస్తున్నారు.

దేశ వ్యాప్తంగా మెట్రో పాలిటిన్ సిటీస్ లో ఏఎంబీ మాల్ ని విస్త‌రించే ఆలోచ‌న‌లోనూ మ‌హేష్ ఉన్నారు. ఇక సిటీ శివార్ల‌లో భారీగా భూములు కూడా క‌లిగియున్నారు. ఫామ్ హౌస్ ల పేరిట వాటిలో వివిధ ర‌కాల పంట లు పండిస్తున్నారు. తాజాగా మ‌హేష్ శంకర్‌పల్లి సమీపంలోని 2.5 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. భూమి రిజిస్ట్రేషన్ కోసం నమ్రత శంకర్‌పల్లి మండల రెవెన్యూ కార్యాలయాన్ని సందర్శించారు. గోపులా పురం గ్రామంలో ఈ భూమిని కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తుంది.

నమ్రత హాజరయ్యారని తెలుసుకున్న పలువురు అభిమానులు ఎమ్ ఆర్ వో కార్యాలయానికి త‌ర‌లి వ‌చ్చారు. ఆమెతో క‌లిసి ఫోటోలు దిగేందుకు ఎగ‌బ‌డ్డారు. న‌మ్ర‌త కూడా విసుగు చెంద‌కుండా అడిగిన వారంద‌ర‌కీ సెల్పీలు ఇచ్చారు. మ‌హేష్ తాజా ఇన్వెస్ట్ మెంట్ ని బ‌ట్టి భూముల కొనుగోలు విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేద‌ని తెలుస్తోంది. వ‌చ్చిన ఆదాయ‌న్ని తెలివైన పెట్టుబ‌డిగా ల్యాండ్స్ మీద పెడు తున్నారు. ఈ మొత్తం వ్య‌వ‌హారాల‌న్నింటిని మ‌హేష్ స‌తీమ‌ణి న‌మ్ర‌త చూసుకుంటున్నారు.

అన్ని వ్యాపారాల్లోనూ ఆమె కూడా భాగ‌స్వామిగా ఉంటూ వాటిని ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. ముఖ్యం గా ఆర్ధిక లావాదేవీల విష‌యంలో న‌మ్ర‌త స్వ‌యంగా ఎంట‌ర్ అవుతారు. థ‌ర్డ్ ప‌ర్స‌న్ ఇన్వాల్వ్ మెంట్ అనేది ఉండ‌దు. మ‌హేష్ కి వీట‌న్నింటిని చూసుకునే స‌మ‌యం ఉండ‌దు. దీంతో అన్నింటిని భార్య‌నే చూసు కుంటారు. చెక్ ప‌వ‌ర్ అంతా న‌మ్ర‌త పేరు మీద‌నే ఉంటుంద‌ని తెలుస్తోంది.