Begin typing your search above and press return to search.
బాబు మాటల్లో బడాయి బయటపడిపోయింది
By: Tupaki Desk | 1 Nov 2016 11:39 AM GMT చంద్రబాబు మాటలే తప్ప పనేమీ చేయడం లేదని వైసీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. తాము ఎంతో కాలంగా చేస్తున్న ఈ ఆరోపణ నిజమని రుజువైందని... సామాజిక అధ్యయనాల సంస్థ (సెస్) నివేదికతో చంద్రబాబు మాటల్లో బడాయి బయటపడిందని వైసీపీ ఎమ్మెల్యే వైవీ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాష్ర్టాన్ని ఏదో చేసేస్తానని చెప్పిన చంద్రబాబు పాలనలో ఏపీ నానాటికీ నీరసించిపోతుందని ఆయన అన్నారు.
హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని ఈ నివేదిక బయటపెట్టిందన్నారు. ఏపీ రైతాంగం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు సెస్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీ రైతులు అప్పుల్లో మునిగిపోయారని ఆ నివేదికలో పేర్కొంటే - రెండంకెల వృద్ధి రేటు అని, వ్యవసాయ మిషన్ అని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారన్నారు.
చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని.. రైతులను ఆదుకోవాలని సూచించారు. సెస్ నివేదికతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలని - వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు దుర్బర పరిస్థితుల్లో ఉన్నారని.. వారిపై దృష్టి పెట్టాలని సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
హైదరాబాద్ లోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీ వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని ఈ నివేదిక బయటపెట్టిందన్నారు. ఏపీ రైతాంగం దారుణమైన పరిస్థితుల్లో ఉన్నట్లు సెస్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఏపీ రైతులు అప్పుల్లో మునిగిపోయారని ఆ నివేదికలో పేర్కొంటే - రెండంకెల వృద్ధి రేటు అని, వ్యవసాయ మిషన్ అని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారన్నారు.
చంద్రబాబు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలని.. రైతులను ఆదుకోవాలని సూచించారు. సెస్ నివేదికతో అయినా ప్రభుత్వం కళ్లు తెరవాలని - వ్యవసాయ రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతులు దుర్బర పరిస్థితుల్లో ఉన్నారని.. వారిపై దృష్టి పెట్టాలని సూచించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/