Begin typing your search above and press return to search.
వైఎస్సార్సీపీ రెండు టీవీ చానళ్లను కొన్నట్టేనా!
By: Tupaki Desk | 12 May 2019 8:00 PM ISTజగన్ సొంత మీడియా సంస్థ కాకుండా వైఎస్సార్సీపీకి మరే మీడియా సంస్థ కూడా అండగా లేనట్టే. జగన్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆయనపై మీడియా వర్గాలు అక్కసునే వెల్లగక్కుతూ ఉన్నాయి. మొదట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ల కోసం - చంద్రబాబు కోసం మెజారిటీ మీడియా జగన్ ను లక్ష్యంగా చేసుకొంటూ వచ్చింది. ఆ తర్వాత పూర్తి చంద్రబాబుకు జాకీలు వేస్తూ జగన్ మీద ఏదో ఒక రకంగా అక్కసును వెల్లగక్కకడమే పనిగా పెట్టుకున్నా మీడియా వర్గాలు.
రెండు పెద్ద పత్రికలు, ఇంకా అనేక టీవీ వార్తా చానళ్లు జగన్ ను లక్ష్యంగా చేసుకొంటూ సాగుతున్నాయి. అలా మీడియా తననే లక్ష్యంగా చేసుకున్నా తట్టుకుంటూ వచ్చాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇలాంటి నేపథ్యంలోనే ఏపీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పూర్తి అయ్యింది.
ఇక ఫలితాల కోసం వేచి ఉన్నారంతా. విజయం వైఎస్సార్సీపీనే వరిస్తుందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ సంగతలా ఉంటే.. తమ మీడియా బలాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఉందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందు కోసం ఒక చానల్ ను టేకోవర్ చేయడంతో పాటు మరో చానల్ ను స్థాపించే ఉద్దేశంలో ఉందట. ఆ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ఈ పనిలో ఉన్నట్టుగా సమాచారం.
ఇన్ని రోజులూ కాంగ్రెస్ పార్టీ వాళ్లు నిర్వహించిన రాజ్ న్యూస్ చానల్ ను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టేకోవర్ చేస్తున్నారనే ప్రచారం సాగుతూ ఉంది. దాంతో పాటు మరో చానల్ ను స్థాపించే ఉద్దేశం కూడా ఉందట. అది అటు వార్తలు, ఇటు ఎంటర్ టైన్ మెంట్.. రెండింటినీ మేనేజ్ చేస్తూ సాగుతుందని సమాచారం.
ఇప్పటికే ఉన్న 'సాక్షి' కి తోడు ఈ రెండు మీడియా వర్గాల ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన మీడియా బలాన్ని పెంచుకోవాలని భావిస్తోందని, విజయసాయి రెడ్డి ఇందుకు సంబంధించిన కసరత్తును సాగిస్తున్నట్టుగా సమాచారం.
రెండు పెద్ద పత్రికలు, ఇంకా అనేక టీవీ వార్తా చానళ్లు జగన్ ను లక్ష్యంగా చేసుకొంటూ సాగుతున్నాయి. అలా మీడియా తననే లక్ష్యంగా చేసుకున్నా తట్టుకుంటూ వచ్చాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇలాంటి నేపథ్యంలోనే ఏపీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ పూర్తి అయ్యింది.
ఇక ఫలితాల కోసం వేచి ఉన్నారంతా. విజయం వైఎస్సార్సీపీనే వరిస్తుందనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ సంగతలా ఉంటే.. తమ మీడియా బలాన్ని పెంచుకునే ఉద్దేశంతో ఉందట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందు కోసం ఒక చానల్ ను టేకోవర్ చేయడంతో పాటు మరో చానల్ ను స్థాపించే ఉద్దేశంలో ఉందట. ఆ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి ఈ పనిలో ఉన్నట్టుగా సమాచారం.
ఇన్ని రోజులూ కాంగ్రెస్ పార్టీ వాళ్లు నిర్వహించిన రాజ్ న్యూస్ చానల్ ను వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి టేకోవర్ చేస్తున్నారనే ప్రచారం సాగుతూ ఉంది. దాంతో పాటు మరో చానల్ ను స్థాపించే ఉద్దేశం కూడా ఉందట. అది అటు వార్తలు, ఇటు ఎంటర్ టైన్ మెంట్.. రెండింటినీ మేనేజ్ చేస్తూ సాగుతుందని సమాచారం.
ఇప్పటికే ఉన్న 'సాక్షి' కి తోడు ఈ రెండు మీడియా వర్గాల ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన మీడియా బలాన్ని పెంచుకోవాలని భావిస్తోందని, విజయసాయి రెడ్డి ఇందుకు సంబంధించిన కసరత్తును సాగిస్తున్నట్టుగా సమాచారం.
