Begin typing your search above and press return to search.

వామ్మో జ‌గ‌న్ గారు విన్నారా..! మీ ఎమ్మెల్యే కాబోయే సీఎం అంట‌!

By:  Tupaki Desk   |   17 April 2020 9:10 AM GMT
వామ్మో జ‌గ‌న్ గారు విన్నారా..! మీ ఎమ్మెల్యే కాబోయే సీఎం అంట‌!
X
నలుగురిలో నడిచేదారిలో వెళితే ఏముంటుంది.. కాస్తా డిఫెరెంట్ గా వెళితేనే కదా గుర్తింపు.. చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే కూడా ఇప్పుడు అదే దారిలో వెళ్తోంది. సోషల్ మీడియాలో తన సేవా తత్పరతతో ఓవరాక్షన్ తో ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. అయితే ఆమె ప్రచారంతో వెలుగులోకి రావడాన్ని ఎవ్వరూ కాదనరు..కానీ ఆమె అభిమానుల పిచ్చి వైసీపీ అధిష్టానాన్నే ఎదురించేలా.. ఆమె సీటుకే ఎసరు తెచ్చేలా ఉందన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

చిలకూరిపేట ఎమ్మెల్యే విడుదల రజినీ అభిమానులకు పిచ్చి పీక్స్ లో ఉన్నట్టు ఉంది. ఏకంగా వైసీపీ అధ్యక్షుడినే ఎదురించేలా వీరి చేష్టలుండడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోందన్న ప్రచారం సాగుతోంది. ఏదో వైసీపీ అధ్యక్షుడు - సీఎం జగన్ దయతలిచి సీటు ఇస్తే.. వైసీపీ గాలిప్రభంజనంలో గెలిచిన ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ‘అంతకుమించి’ అన్నట్టు గా వ్యవహరించడం వైసీపీలో చర్చనీయాంశమవుతోంది.

తాజాగా ఆ వైసీపీ ఎమ్మెల్యే అభిమానులు - పెయిడ్ వర్కర్స్ పిచ్చి పీక్స్ లోకి వెళ్లింది.పోయిన ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా తృటిలో ఓట‌మి నుంచి త‌ప్పించుకున్న ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా ముఖ్య‌మంత్రి కాబోతున్నారంట‌ ప్రచారం విస్తుగొలుపుతోంది. ఇదంతా ఆమె పెయిడ్ అభిమానులు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం చేసుకుంటున్నారు.

ప్ర‌స్తుతం చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే విడుదల రజినీ సీఎం కాబోతున్నారనే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది.ఆమె ఎమ్మెల్యే అయినప్ప‌టి నుంచి సోష‌ల్ మీడియా కోసం కొంద‌రినీ నియ‌మించుకున్నారట.. వారి చేత తాను చేసే కార్య‌క్ర‌మాలు గోరంత అయితే కొండంత‌గా ప్ర‌చారం చేసేందుకు ఆ పెయిడ్ అభిమానులు ఉన్నారట.. దీంతో సోష‌ల్ మీడియాలో ఆమె ఫొటోలు - వీడియోలు విస్తృతంగా ప్ర‌చారం చేసుకుంటూ జై కొడుతున్నారు. ఆమె వెనుక ఉత్త‌రాంధ్ర‌కు చెందిన ఒక మంత్రి ఉన్నార‌ని - అధిష్టానంలో టీడీపీ నుంచి వ‌చ్చిన ఒక సీనియ‌ర్ నాయ‌కుడు ఉన్నాడ‌ని నియోజ‌క‌వ‌ర్గంలో గుప్పుమంటోంది.

చిలకలూరిపేట సీనియర్ లీడర్ ను కాదని.. టీడీపీలో ఉన్న ఈమెను తీసుకొని వచ్చి ఎమ్మెల్యే సీటు ఇస్తే ఏకంగా సీఎం జగన్ కే ఎసరు పెట్టేలా ఈమె వ్యవహరిస్తుండడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. ఆమె గ‌తంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న‌ప్పుడు జ‌గ‌న్‌ ను ఎవ‌రూ అన‌ని మాట‌ల‌న్నీ అన్న కూడా వైఎస్సార్సీపీ త‌ర‌ఫున టికెట్ ఇస్తే కృత‌జ్ఞ‌తా భావం లేకుండా రెచ్చిపోతున్నార‌ని నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ సాగుతోంది.

ప్రస్తుతం క‌రోనా స‌హాయం పేరిట ఆమె సినిమాలో మాదిరి స్టిల్స్ ఇస్తూ ప్ర‌చారం చేసుకుంటున్నారు. ఆమె వ్య‌వ‌హార శైలిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు కూడా విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఏకంగా పార్టీ అధినేత‌ - ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డికే పోటీ వెళ్లేలా ఆమె పెయిడ్ అభిమానులు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డంతో వైసీపీ అధిష్టానాన్ని సైతం విస్తుగొలుపుతోందట.. ఆమె ఏకంగా మంత్రి ప‌ద‌వి కోసం.. లేదా త‌న ప‌లుబడి చూపించుకునేందుకు ఈ విధంగా డ‌బ్బులు ఇచ్చి మ‌రి ప్ర‌చారం చేసుకుంటుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.