Begin typing your search above and press return to search.
గడప.. గడపకు .. అప్పు.. మరియు డబ్బు!
By: Tupaki Desk | 7 April 2022 9:00 PM ISTఏపీ అధికార పార్టీ వైసీపీలో ఒక నిర్ణయం తీసుకున్నారు. మే నెల నుంచి ఎమ్మెల్యేలు.. ప్రజల వద్దకు వెళ్లా లని.. పార్టీ ఆదేశించింది. ఈ విషయం గత కొన్నాళ్లుగా నలుగుతూనే ఉంది. ఇటీవల ముడిసిన అసెంబ్లీ సమావేశాల సమయంలో నిర్వహించిన శాసనసభా పక్ష సమావేశంలో.. సీఎం జగన్ తన పార్టీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ప్రజల్లో ఉండాలని.. ప్రభుత్వం చేస్తున్న పనులను వివరించాలని ఆదేశించా రు. ప్రభుత్వం ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని.. వీటిని ప్రజలకు వివరించాలని.. జగన్ ఆదేశించినట్టు చర్చకు వచ్చింది.
ఇక, ఇప్పుడు దీనికి సంబంధించి ముహూర్తం కూడా పెట్టారు. మే నెల నుంచి నాయకులు.. ప్రజల్లో ఉం డాలని.. ఉంటారని.. సలహాదారు.. సజ్జల రామకృష్నారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఎమ్మెల్యేల పరిస్థి తిని చూస్తే... ఈ గడప, గడపకు కార్యక్రమం ``గడప గడపకు.. అప్పు.. మరియు డబ్బు`` అన్న రీతిలో ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎమ్మెల్యేలు మొత్తం డమ్మీ.. అని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకం టే.. గడప గడపకు వెళ్లి.. కార్యక్రమం నిర్వహించే ఎమ్మెల్యేలు ఏం చెబుతారు? ప్రజలకు ఏం వివరిస్తారు? అనేది చర్చకు వస్తోంది.
నిజానికి రాష్ట్రంలో ఈ పని చేసి... ఇంత సొమ్ము సంపాయించి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం.. ఈయీ కంపెనీలను విదేశాల నుంచి తీసుకువచ్చాం.. అని చెప్పుకొనేందుకు కూడా ఏమీలేదు. అంతా అప్పులు చేసి.. అప్పులపై అప్పులు తెచ్చి.. కేంద్రాన్ని బామాలుకుని.. బ్రతిమలాడుకుని.. తెచ్చిన అప్పుల సొమ్ముతో పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజలకు పంచుతున్నారు. అయితే.. ఈ అప్పుల భారం.. దీనికి అయ్యే వడ్డీల భారం ఎవరు తీరుస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. రేపు ప్రజల్లోకి వెళ్లే ఎమ్మెల్యేలకు ఇదే ప్రశ్నలు వస్తుంటాయి.
ఎందుకంటే.. ఎమ్మెల్యేలు కేవలం మెసేంజర్లు మాత్రమే. వారు సీఎం జగన్ ఏం చెప్పమంటే.. అదే చెబు తారు. ఏం ఇవ్వమంటే అదే ఇస్తారు. జగన్ పాంప్లేట్ ఇస్తాడు.. అంట.. అదే తీసుకుని వెళ్లి ఎమ్మెల్యేలు.. గడప గడపకు.. ఇచ్చి.. ``అమ్మా.. మీకుఇచ్చి పింఛన్లు ఇచ్చాము, ఇచ్చి పథకాలు ఇచ్చాము.. కాబట్టి..మమ్మల్నే మళ్లీ మళ్లీ.. `` అని చెబుతారు. ఇంతవరకు ఓకే... కానీ.. ఇదే సమయంలో ప్రజల నుంచి కూడా అనేక ప్రశ్నలు ఎదురయ్యేందుకు అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా.. విద్యుత్ చార్జీల పెంపు.. బాదుడు.. ప్రజలను కన్నీరు పెట్టిస్తోంది.
ఇక, విద్యుత్ కోతలు.. చెత్తపై పన్ను..ఓటీఎస్.. ఇలా అనేక రూపాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రు. కరెక్ట్గా ఈ సమయంలోనే ఎమ్మెల్యేలు.. ప్రజలను కలుసుకునేందుకు గడపగడపకు వెళ్లడం.. జరిగితే.. ప్రజలు సంధించే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెబుతారోచూడాలి. ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమకు శంకుస్తాపన జరగలేదు. ఒక్క పెట్టుబడిని కూడా తీసుకురాలేదు. ఇప్పుడు గడప గడపకు అంటే.. ప్రయోజనం కన్నా.. ప్రశ్నలు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు పరిశీలకులు.
ఇక, ఇప్పుడు దీనికి సంబంధించి ముహూర్తం కూడా పెట్టారు. మే నెల నుంచి నాయకులు.. ప్రజల్లో ఉం డాలని.. ఉంటారని.. సలహాదారు.. సజ్జల రామకృష్నారెడ్డి వ్యాఖ్యానించారు. అయితే.. ఎమ్మెల్యేల పరిస్థి తిని చూస్తే... ఈ గడప, గడపకు కార్యక్రమం ``గడప గడపకు.. అప్పు.. మరియు డబ్బు`` అన్న రీతిలో ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎమ్మెల్యేలు మొత్తం డమ్మీ.. అని వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకం టే.. గడప గడపకు వెళ్లి.. కార్యక్రమం నిర్వహించే ఎమ్మెల్యేలు ఏం చెబుతారు? ప్రజలకు ఏం వివరిస్తారు? అనేది చర్చకు వస్తోంది.
నిజానికి రాష్ట్రంలో ఈ పని చేసి... ఇంత సొమ్ము సంపాయించి.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాం.. ఈయీ కంపెనీలను విదేశాల నుంచి తీసుకువచ్చాం.. అని చెప్పుకొనేందుకు కూడా ఏమీలేదు. అంతా అప్పులు చేసి.. అప్పులపై అప్పులు తెచ్చి.. కేంద్రాన్ని బామాలుకుని.. బ్రతిమలాడుకుని.. తెచ్చిన అప్పుల సొమ్ముతో పథకాలు అమలు చేస్తున్నారు. ప్రజలకు పంచుతున్నారు. అయితే.. ఈ అప్పుల భారం.. దీనికి అయ్యే వడ్డీల భారం ఎవరు తీరుస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. రేపు ప్రజల్లోకి వెళ్లే ఎమ్మెల్యేలకు ఇదే ప్రశ్నలు వస్తుంటాయి.
ఎందుకంటే.. ఎమ్మెల్యేలు కేవలం మెసేంజర్లు మాత్రమే. వారు సీఎం జగన్ ఏం చెప్పమంటే.. అదే చెబు తారు. ఏం ఇవ్వమంటే అదే ఇస్తారు. జగన్ పాంప్లేట్ ఇస్తాడు.. అంట.. అదే తీసుకుని వెళ్లి ఎమ్మెల్యేలు.. గడప గడపకు.. ఇచ్చి.. ``అమ్మా.. మీకుఇచ్చి పింఛన్లు ఇచ్చాము, ఇచ్చి పథకాలు ఇచ్చాము.. కాబట్టి..మమ్మల్నే మళ్లీ మళ్లీ.. `` అని చెబుతారు. ఇంతవరకు ఓకే... కానీ.. ఇదే సమయంలో ప్రజల నుంచి కూడా అనేక ప్రశ్నలు ఎదురయ్యేందుకు అవకాశం కనిపిస్తోంది. సరిగ్గా.. విద్యుత్ చార్జీల పెంపు.. బాదుడు.. ప్రజలను కన్నీరు పెట్టిస్తోంది.
ఇక, విద్యుత్ కోతలు.. చెత్తపై పన్ను..ఓటీఎస్.. ఇలా అనేక రూపాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రు. కరెక్ట్గా ఈ సమయంలోనే ఎమ్మెల్యేలు.. ప్రజలను కలుసుకునేందుకు గడపగడపకు వెళ్లడం.. జరిగితే.. ప్రజలు సంధించే ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు చెబుతారోచూడాలి. ఇప్పటి వరకు ఒక్క పరిశ్రమకు శంకుస్తాపన జరగలేదు. ఒక్క పెట్టుబడిని కూడా తీసుకురాలేదు. ఇప్పుడు గడప గడపకు అంటే.. ప్రయోజనం కన్నా.. ప్రశ్నలు ఎదుర్కొనక తప్పదని అంటున్నారు పరిశీలకులు.
