Begin typing your search above and press return to search.

పశ్చిమగోదావరిలో దారుణం..యువతి కిడ్నాప్ - అత్యాచారం

By:  Tupaki Desk   |   7 Oct 2020 5:01 PM GMT
పశ్చిమగోదావరిలో దారుణం..యువతి కిడ్నాప్ - అత్యాచారం
X
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ ఘటనతో చెలరేగుతున్న మంటలు ఆరకముందే ఆంధ్రప్రదేశ్ లో మరో దారుణం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ టీనేజ్ యువతి(17)ని కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

పశ్చిమ గోదావరి జిల్లా సమిశ్రగూడెం గ్రామానికి చెందిన యువతి గత నెల 21న కిడ్నాప్ నకు గురైంది. ఆమెను తూర్పు గోదావరి జిల్లా బొమ్మూరు తీసుకెళ్లి దారుణంగా ఓ వ్యక్తి అత్యాచారం చేశాడు.

పదిహేను రోజుల అనంతరం గ్రామానికి చేరుకున్న యువతి ఈ మేరకు సమిశ్రగూడెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను ఓ వ్యక్తి కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

కాగా ఈ మేరకు ఫిర్యాదు తీసుకున్న నిడదవోలు సీఐ విచారణ జరిపారు. కిడ్నాప్, అత్యాచారం.. ఆమె మైనర్ కావడంతో పోక్సో తదితర సెక్షన్ల కింద కేసులు పెట్టారు. నిందితుడు ఎవరనే దానిపై వివరాలు తెలియాల్సి ఉంది.