Begin typing your search above and press return to search.

సుజనా ఒక బ్యాంక్ దొంగ .. ఏకిపారేసిన వైసీపీ ఎంపీలు !

By:  Tupaki Desk   |   22 Nov 2019 11:48 AM GMT
సుజనా ఒక బ్యాంక్ దొంగ .. ఏకిపారేసిన వైసీపీ ఎంపీలు !
X
ఏపీలో రాజకీయ నేతల విమర్శలు కోటలు దాటుతున్నాయి. ఎన్నికల హడావిడి తగ్గినా కూడా వలసలు తగ్గక పోవడం , అలాగే ఆ పార్టీ నుండి మా పార్టీలోకి భారీగా చేరబోతున్నారు అని రోజుకొకరు మీడియా లో కోడై కూస్తుండటం తో విమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఒకప్పటి టీడీపీ ఎంపీ , ప్రస్తుత బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ... త్వరలోనే వైసీపీ కి చెందిన 20 మంది ఎంపీలు బీజేపీలో చేరబోతున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎంపీలతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారంటూ చెప్పారు.

ఎంపీ సుజనా చౌదరి చేసిన ఈ వ్యాఖ్యలపై ..ఇప్పుడు వైసీపీ కి చెందిన ఎంపీలు సుజనా పై ముప్పేట మాటల దాడికి దిగారు. నేడు ( శుక్రవారం) ఢిల్లీ లో వైసీపీ కి చెందిన కొంతమంది ఎంపీలు మాట్లాడుతూ..సుజనా చౌదరితోపాటు టీడీపీ అధినేత చంద్రబాబు పైనా ధ్వజమెత్తారు. తమ పార్టీ ఎంపీలపై అసత్యాలు ప్రచారం చేయడం మానుకోవాలని , దైర్యం ఉంటే మీతో ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలంటూ సుజనా చౌదరి కి సవాల్ విసిరారు. వైసీపీ డోర్లు తెరిస్తే ఏపీలో టీడీపీ ఖాళీ కావడం ఖాయం అని ,సుజనా నువ్వు బీజేపీలో ఉన్నావా? లేక టీడీపీలో ఉన్నావా? అంటూ ప్రశ్నించారు.బ్యాంకులకు రూ. 6వేల కోట్లు ఎగ్గొట్టిన దానిపై సుజనా చౌదరి మాట్లాడాలని డిమాండ్ చేశారు. తాము చివరి వరకు వైసీపీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.

అలాగే సుజనా చౌదరి పై ట్విట్టర్‌లో ఎంపీ విజయ సాయిరెడ్డి విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ సారి సుజనా వెరైటీ ప్రెస్‌మీట్ పెడితే బాగుంటుందని, ఆ ప్రెస్ మీట్ కి విలేకరులను కాకుండా తాను వేల కోట్లు ముంచేసిన.. అరడజను బ్యాంక్‌ల అధికారులతో ప్రెస్‌మీట్‌ పెట్టాలన్నారు. వాళ్ల ప్రశ్నలకు సమాధానం చెబితే.. ఆయన పార్టీ ఎందుకు మారాడో, టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు మార్చాడో.. అన్నీ అర్థమవుతాయని విజయసాయిరెడ్డి చెప్పారు.