Begin typing your search above and press return to search.
ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్.. భారత్కు నిరాశ.. రెండో స్థానంలోకి పాక్
By: Tupaki Desk | 1 Dec 2021 12:30 AM GMTఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో ప్రస్తుత రన్నరప్ భారత్ ను పాకిస్థాన్ వెనక్కు నెట్టింది. బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. విదేశీ గడ్డ మీద విజయంతోపాకిస్థాన్ ఖాతాలో 12 పాయింట్లు చేరాయి. ఆ జట్టు మొత్తం పాయింట్ల సంఖ్య 24కి పెరిగింది.
అంతేకాక ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ రెండో స్థానానికి చేరుకుంది. అయితే పాకిస్థాన్ కంటే భారత్కు ఎక్కువ పాయింట్లు ఉన్నా విన్నింగ్ పర్సంటేజీలో మాత్రం వెనుకబడి ఉండటంతో భారత్ మూడో స్థానానికి పరిమితమైంది.
దీనికితోడు సోమవారం కాన్పూర్ టెస్టులో భారత్ను విజయం ఊరించి ఉసూరుమనిపించింది. ఈ టెస్టును భారత్ గెలిచి ఉంటే 12 పాయింట్లు వచ్చేవి. విన్నింగ్ పర్సంటేజీ కూడా పెరిగేది. కానీ డ్రా కావడంతో 4 పాయింట్లు మాత్రమే చేరాయి. అటు విజయాల శాతం కూడా తగ్గిపోయింది. టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 5వ స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ జట్టు 6వ స్థానంలో ఉంది.
అంతేకాక ఈ గెలుపుతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్థాన్ రెండో స్థానానికి చేరుకుంది. అయితే పాకిస్థాన్ కంటే భారత్కు ఎక్కువ పాయింట్లు ఉన్నా విన్నింగ్ పర్సంటేజీలో మాత్రం వెనుకబడి ఉండటంతో భారత్ మూడో స్థానానికి పరిమితమైంది.
దీనికితోడు సోమవారం కాన్పూర్ టెస్టులో భారత్ను విజయం ఊరించి ఉసూరుమనిపించింది. ఈ టెస్టును భారత్ గెలిచి ఉంటే 12 పాయింట్లు వచ్చేవి. విన్నింగ్ పర్సంటేజీ కూడా పెరిగేది. కానీ డ్రా కావడంతో 4 పాయింట్లు మాత్రమే చేరాయి. అటు విజయాల శాతం కూడా తగ్గిపోయింది. టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో శ్రీలంక అగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ 5వ స్థానంలో ఉండగా, ఇంగ్లండ్ జట్టు 6వ స్థానంలో ఉంది.