Begin typing your search above and press return to search.
నదిలో కొట్టుకువచ్చిన చెక్క పెట్టె .. పెట్టెలో 21 రోజుల చిన్నారి !
By: Tupaki Desk | 16 Jun 2021 2:30 PM GMTగంగానదిలో ఓ చక్క పెట్టె కొట్టుకువచ్చింది. అందులో ఓ చంటి బిడ్డతో పాటు, అమ్మవారి ఫోటో ఉండటం కలకలం రేపింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఓ చంటి బిడ్డను ఓ చెక్కపెట్టెలో పెట్టి గంగానదిలో వదిలేసిన ఘటన ఆశ్చర్యానికి గురిచేసింది. నదిలో కొట్టుకొస్తున్న ఓ పెట్టెను కూడా ఒడ్డుకు చేరిన స్థానికులు దాన్ని తెరిచి చూసి షాక్ అయ్యారు. ఆ పెట్టెలో ఓ ఎర్రని వస్త్రం మీద ఓ చంటిబిడ్డ తో పాటు కనకదుర్గ అమ్మవారి ఫోటో కూడా ఉండటం చూసి అంతా అశ్చర్యపోయారు. యూపీలోని ఘాజీపూర్ లో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
ఘాజీపూర్ లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తుండటంతో పడవ నడిపే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. దీనితో పరిశీలించి చూడగా నదిలో కొట్టుకు వస్తున్న చెక్కపెట్టెనుంచే చంటిబిడ్డ ఏడుపులు వినిపించాయి. దీనితో ఆ చెక్క పెట్టను పట్టుకున్నాడు. తెరిచి చూస్తే అందులో ఆడ బిడ్డ ఉంది. బిడ్డ వయసు 21 రోజులు ఉంటుంది. ఆమెతో పాటు అమ్మవారి పఠాన్ని కూడా పెట్టి ఉంది. పెట్టెలో ఓ పేపర్లో జాతకం ప్రకారం..ఆ బిడ్డకు గంగ అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది. దీంతో ఆ పడవ నడిపే వ్యక్తి ఆ బిడ్డను తన ఇంటికి తీసుకెళ్లాడు. బిడ్డను తనకే గంగమ్మే ఇచ్చింది. ఇది నా అదృష్టం అని మురిసిపోయాడు. ఈ బిడ్డను తాను పెంచుకుంటానని చెప్పాడు. అయితే ఈ విషయం స్థానికులు పోలీసులకు తెలియజేయటంతో పోలీసులు ఆ పాపను స్వాధీనం చేసుకున్నారు. బిడ్డను పెంచుకోవడం కుదరదన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలన్నారు. బిడ్డను ఆశాజ్యోతి కేర్ సెంటర్ కు తరలించారు.
ఘాజీపూర్ లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని దాద్రి ఘాట్ వద్ద గంగానదిలో చంటిబిడ్డ ఏడుపులు వినిపిస్తుండటంతో పడవ నడిపే వ్యక్తి ఆశ్చర్యపోయాడు. దీనితో పరిశీలించి చూడగా నదిలో కొట్టుకు వస్తున్న చెక్కపెట్టెనుంచే చంటిబిడ్డ ఏడుపులు వినిపించాయి. దీనితో ఆ చెక్క పెట్టను పట్టుకున్నాడు. తెరిచి చూస్తే అందులో ఆడ బిడ్డ ఉంది. బిడ్డ వయసు 21 రోజులు ఉంటుంది. ఆమెతో పాటు అమ్మవారి పఠాన్ని కూడా పెట్టి ఉంది. పెట్టెలో ఓ పేపర్లో జాతకం ప్రకారం..ఆ బిడ్డకు గంగ అని పేరు పెట్టినట్లుగా రాసి ఉంది. దీంతో ఆ పడవ నడిపే వ్యక్తి ఆ బిడ్డను తన ఇంటికి తీసుకెళ్లాడు. బిడ్డను తనకే గంగమ్మే ఇచ్చింది. ఇది నా అదృష్టం అని మురిసిపోయాడు. ఈ బిడ్డను తాను పెంచుకుంటానని చెప్పాడు. అయితే ఈ విషయం స్థానికులు పోలీసులకు తెలియజేయటంతో పోలీసులు ఆ పాపను స్వాధీనం చేసుకున్నారు. బిడ్డను పెంచుకోవడం కుదరదన్నారు. దీనిపై దర్యాప్తు చేయాలన్నారు. బిడ్డను ఆశాజ్యోతి కేర్ సెంటర్ కు తరలించారు.