Begin typing your search above and press return to search.

వైసీపీ విజయవాడ మేయర్ అభ్యర్థినిగా ఆమె పేరు ఖరారు?

By:  Tupaki Desk   |   5 March 2021 5:00 PM IST
వైసీపీ విజయవాడ మేయర్ అభ్యర్థినిగా ఆమె పేరు ఖరారు?
X
ఏపీలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. ఇప్పటికే రాజధాని అమరావతికి కేంద్రమైన విజయవాడ కార్పొరేషన్ దక్కించుకునేందుకు టీడీపీ వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే విజయవాడ ఎంపీ కేశినేని కూతురు శ్వేతను టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది.

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ప్రచారం చేస్తూ కాకరేపుతున్నారు. నారా లోకేష్ సైతం కోస్తా ఆంధ్రాలో ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాలకు కేంద్రబిందువుగా భావించే విజయవాడపైనే అందరి దృష్టి నెలకొంది. టీడీపీకి గట్టి పట్టున్న ఈ కార్పొరేషన్ పై వైసీపీ నజర్ పెట్టింది.ఇక్కడ 2019లో రాష్ట్రమంతట వైసీపీ గెలిచినా విజయవాడ ఎంపీ సీటును మాత్రం గెలుచుకోలేకపోయింది. ఈ క్రమంలోనే టీడీపీ ఎంపీ కేశినేని నాని తాజాగా విజయవాడ మేయర్ అభ్యర్థిగా తన కూతురు శ్వేతను ప్రకటించారు.

ఈ క్రమంలోనే వైసీపీ తరుఫున అంతకుమించిన బలమైన నేత కోసం వైసీపీ ఆరాతీస్తోంది. రెండు పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వైసీపీ సీనియర్ నాయకుడు పూనూరు గౌతం రెడ్డి కుమార్తె లిఖితారెడ్డి, కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ బండి పుణ్యశీలి పేర్లు వైసీపీ తరుఫున ప్రచారంలో ఉన్నాయి. బ్రాహ్మణ సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇవ్వాలని వైసీపీ యోచిస్తోంది. ఈ ఇద్దరు జగన్ ఎవరిని ఖరారు చేస్తారన్నది చూడాలి.