Begin typing your search above and press return to search.

దేశంలో కరోనా వైరస్ మూడో దశకు చేరుకుందా?

By:  Tupaki Desk   |   1 April 2020 4:00 AM IST
దేశంలో కరోనా వైరస్ మూడో దశకు చేరుకుందా?
X
మొదటి దశలో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతాయి. రెండో దశలో 100 దాటుతాయి.. మూడో దశలో వేల కేసులు.. ఇటలీలో మూడో దశలో వేల కేసులు నమోదై మరణ మృదంగం వాయిస్తోంది. అంతటి భయంకర కరోనా వైరస్ భారత దేశంలో మూడో దశకు చేరుతోందనే వాదన వినిపిస్తోంది.

దేశంలో మొదట విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు, కలిసిన వారికి సోకింది. ఇప్పుడు మూడో దశలో సామూహికంగా బయటివారికి కూడా సోకడం మొదలైంది.

మూడోదశలో లోకల్ వ్యాప్తి చెందిన రోగులను గుర్తించడం చాలా కష్టం. లక్షణాలు ఉన్నా లేకపోయినా అందరికీ పరీక్షలు చేయాల్సిందే.. కరోనా మూడో దశకు చేరిందని ఇప్పటివరకు కేంద్రం ప్రకటించలేదు.

అయితే కరోనా రోగుల తో తిరగకపోయినా.. కలవకపోయినా కొంతమందికి కరోనా పాజిటివ్ గుర్తించినట్టు మార్చి 28న కేంద్ర అధికారులు వెల్లడించారు. ట్రావెల్ హిస్టరీ లేనివారిలో వైరస్ గుర్తించారు. వైరస్ మూడో దశ ఇదీ అని ఎలా వ్యాపిస్తుందని కూడా తెలియదని ఐసీఎంఆర్ చీఫ్ రామన్ తెలిపారు. దీన్ని బట్టి దేశంలో కరోనా వైరస్ మూడో దశకు చేరుకుందని వివరించారు.