Begin typing your search above and press return to search.

కరోనా ఎక్కడ ఎలా పుట్టిందో చెప్పిన డబ్ల్యూహెచ్ఓ

By:  Tupaki Desk   |   16 July 2021 11:30 AM GMT
కరోనా ఎక్కడ ఎలా పుట్టిందో చెప్పిన డబ్ల్యూహెచ్ఓ
X
ప్రపంచం మొత్తాన్ని ఆవహించి అందరి ఆర్థిక మూలాలు దెబ్బతీసి.. ఉద్యోగ ఉపాధి కోల్పోయేలా చేసిన కరోనా మహమ్మారి చైనాలోని వూహాన్ లో పుట్టింది. అయితే అది ఎలా పుట్టిందనేది ఎవరికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా పాకి అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూల్చింది.


కరోనా వైరస్.. ప్రపంచాన్ని గుప్పిట పట్టి కబళిస్తున్న ఈ మహమ్మారి పుట్టుక గురించి ఇప్పటికీ ఎన్నో సందేహాలున్నాయి. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే ఈ వైరస్ పుట్టిందని..చైనానే తయారు చేసిందన్న ఆరోపణలు భారీగా వచ్చాయి. ఇన్నాళ్లు దీనిపై కొట్టిపారేసిన ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) తాజాగా మాట మార్చింది.

ఇప్పటికే అమెరికా, బ్రిటన్ సహా కొన్ని దేశాలు ఈ కరోనా వైరస్ చైనానే పుట్టించిందని.. వూహాన్ ల్యాబ్ లో తయారు చేసిందని ఆరోపించాయి. అయితే డబ్ల్యూహెచ్ఓ మాత్రం చైనాను సమర్థించుకుంటూ అదేం లేదు అని కొట్టిపారేసింది. తాజాగా డబ్ల్యూహెచ్ఓ స్వరంలో మార్పు వచ్చింది.

చైనాలోని వూహాన్ నగరంలో కరోనా పుట్టింది. కరోనా పుట్టినిల్లు ఆ నగరమే.. అక్కడి నుంచి చైనాలోని ఇతర ప్రాంతాలకు.. ఇతర దేశాలకు పాకింది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసి లక్షలమందిని చంపేసింది. తాజాగా కరోనా వైరస్ మూలాలు కనుక్కునే పనిలో డబ్ల్యూ.హెచ్.వో పడింది. దీనికోసం 10 మంది నిపుణులతో కూడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) బృందం చైనాలోని కరోనా పుట్టినిల్లు వూహాన్ లో పర్యటించింది.. కరోనా మూలాలను గుర్తించేందుకు చైనా వెళ్లిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) బృందం ఎట్టకేలకు దర్యాప్తు ప్రారంభించింది. చైనా నిబంధనల ప్రకారం వూహాన్ లో 14 రోజులపాటు క్వారంటైన్ తర్వాత క్షేత్రస్తాయి పర్యటనకు వెళ్లింది.

14మంది సభ్యులు చైనాలోని వూహాన్ లో నెలరోజుల పాటు పరిశోధన చేయనున్నారు. కరోనా మానవులకు ఎలా సంక్రమించిందనే దానిపై అన్వేషించనున్నారు. వైరస్ లీక్ అయినట్లు అనుమానిస్తున్న వూహాన్ వైరాలజీ ల్యాబ్ ను కూడా వీరు పరిశీలించారు.

కరోనా సోకిన తొలి వ్యక్తి 'పేషెంట్ జీరో'ను కనుక్కునే పనిలో పడింది. అయితే కరోనా సోకిన తొలి వ్యక్తిని కనిపెట్టడం అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.వో) పేర్కొంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఎప్పటికీ కనిపెట్టలేకపోవచ్చని డబ్ల్యూ.హెచ్.వో వ్యాధుల విభాగం టెక్నికల్ లీడ్ మారియా వాన్ స్పష్టం చేసింది. దీంతో కరోనా మూలాలు కనుక్కోవడం అసాధ్యమన్న సంగతి తెలిసిపోయింది.

సరికొత్త వైరస్ లపై పరిశోధన చేస్తున్న చైనా శాస్త్రవేత్తలు చేసిన అశ్రద్ధ వల్లే ఇప్పుడు కరోనా ప్రపంచానికి అంటుకుందని డబ్ల్యూహెచ్.వో ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు సమాచారం. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ.హెచ్.ఓ) నిబంధనలను పాటించకుండా.. గ్లోవ్స్, మాస్క్ లు ధరించకుండా ఓ గబ్బిలాల గుహలోకి వెళ్లారని ఇప్పటికే బయటపడింది. ఈ గుహలో కరోనా సోకిన గబ్బిలాలు తమను కుట్టినట్టు వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) శాస్త్రవేత్తలు అంగీకరించారట.. దీంతో చైనా శాస్త్రవేత్తల ప్రయోగాలే ఇప్పుడు ప్రపంచానికి శాపంగా మారాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమానించి ఇప్పుడు పరిశోధన ప్రారంభించింది.

కరోనా వైరస్ వూహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయ్యిందన్న వాదనను కొట్టిపారేయడం మరీ తొందరపాటు అవుతుందని డబ్ల్యూహెచ్.వో చీఫ్ టెడ్రోస్ పేర్కొన్నారు. దీంతో ఇన్నాళ్ల ఊహాగానాలకు బలం చేకూరినట్టైంది.