Begin typing your search above and press return to search.

ఎంపీ రఘురామపై ఎఫ్ఐఆర్ లో ఏముందంటే?

By:  Tupaki Desk   |   15 May 2021 6:43 AM GMT
ఎంపీ రఘురామపై ఎఫ్ఐఆర్ లో ఏముందంటే?
X
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఎందుకు అరెస్ట్ చేసింది ఎఫ్ఐఆర్ లో స్పష్టంగా పేర్కొంది సీఐడీ. హైదరాబాద్ లోని ఆయన ఇంటిలో అరెస్ట్ చేసిన సీఐడీ పోలీసులు గుంటూరులోని ఏపీ సీఐడీ ఆఫీసులో నిన్న రాత్రి ఒంటిగంట వరకు ప్రశ్నించారు. ఆయనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను తాజాగా బయటపెట్టారు.

ఎంపీ రఘురామకృష్ణంరాజు సామాజిక మాధ్యమాల ద్వారా ఏపీలోని కొన్ని సామాజికవర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ పోలీసులు చేసినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు ఎంపీ రఘురామ రెండు న్యూస్ చానెల్స్ తో కలిసి కుట్ర చేశాడని అందులో పేర్కొన్నారు. రఘురామ చేసిన ప్రతి చర్య ఏపీ సర్కార్ ప్రతిష్ట దిగజార్చేలా ఉందని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాటలు, విడుదల చేసిన వీడియోలు, చేష్టలు, ఉన్నాయని.. అవన్నీ హింసను ప్రేరేపించేలా ఉన్నాయని ఎఫ్ఐఆర్ కాపీలో పేర్కొన్నారు.

తాజాగా ఎఫ్ఐఆర్ లో ఎంపీ రఘురామకృష్ణంరాజుపై మోపిన కేసులో సీఐడీ అధికారులు రెండు న్యూస్ చానెల్స్ ను కూడా నిందితులుగా చేర్చింది. రఘురామను ఏ1గా పేర్కొన్న పోలీసులు ఏ2గా, ఏ3గా తెలుగులోని ప్రముఖ న్యూస్ చానెల్స్ ను ఎఫ్ఐఆర్ లో చేర్చారు.

సదురు రెండు న్యూస్ చానెళ్లతో కలిసి ఎంపీ రఘురామ కుట్ర చేశారని సీఐడీ ఎఫ్ఐఆర్ లో ఆరోపించింది. రఘురామకృష్ణం రాజు ఆ రెండు టీవీ న్యూస్ చానెళ్లు ప్రత్యేకంగా స్లాట్లు కేటాయించి కుట్ర చేశాయని ఎఫ్ఐఆర్ లో సీఐడీ ఆరోపించింది. సీఐడీ డీఐజీ నివేదిక ఆధారంగా కేసు నమోదు చేశామని పేర్కొంది.

రఘురామకృష్ణం రాజును సీఐడీ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట వరకు విచారించారు. సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో రాజును ప్రశ్నించారు. సామాజికవర్గాల మధ్య విధ్వేషం సృష్టించే విధింగా ఎందుకు వ్యాఖ్యానించారు..? ఎంపీ వెనుక ఎవరున్నారనే కోణంలో సీఐడీ అధికారులు విచారణ జరుపుతున్నారు.ఎంపీ రఘురామ అరెస్ట్ ను సవాల్ చేస్తూ దాఖలైన హౌస్ మోషన్ పిటీషన్ మీద ఈరోజు కోర్టులో విచారణ జరుగనుంది. కోర్టు ఎంపీని రిమాండ్ కు తరలించ్చవద్దని సీఐడీని ఆదేశించింది.