Begin typing your search above and press return to search.

హిజాబ్ అంటే ఏమిటీ? అసలేంటి వివాదం.. కర్ణాటకను ఎందుకు కుదిపేస్తోంది?

By:  Tupaki Desk   |   9 Feb 2022 3:30 AM GMT
హిజాబ్ అంటే ఏమిటీ? అసలేంటి వివాదం.. కర్ణాటకను ఎందుకు కుదిపేస్తోంది?
X
కర్ణాటక రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో ముస్లిం విద్యార్థినులు 'హిజాబ్' ధరించడంపై రాజకీయ రగడ కొనసాగుతోంది. వీరు హిజాబ్ ధరించొద్దంటూ ఒక వర్గం ఆందోళన చేస్తోంది. అయితే హిజాద్ ధరించడం తమ హక్కు అని ముస్లిం విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో హిందూమతానికి చెందిన విద్యార్థి, విద్యార్థినులు కాషాయ కండువతో విద్యాసంస్థలకు వస్తున్నారు. దీంతో ఈ వ్యవహారం కోర్టు వరకు వెళ్లడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా బీజేపీ పాలిత రాష్ట్రంలో ఇలాంటి వివాదం చోటు చేసుకోవడంతో ప్రతి పక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా.. కొన్ని పార్టీల నాయకులు మాత్రం ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలుకుతున్నారు.

-హిజాబ్ అంటే ఏమిటీ?
హిజాబ్ అంటే తెర.. మహిళలు జట్టును, మెడను ఏదైనా బట్టతో కప్పి ఉంచడాన్ని 'హిజాబ్ ' అంటారు. ముఖం మాత్రం కనిపిస్తుంది. బురఖా అంటే స్త్రీల శరీరం పూర్తిగా కప్పబడి ఉంటుంది. బురఖా దరిస్తే మహిళ శరీరంలోని ఏ భాగం కనిపించదు. చాలా దేశాల్లో దీనిని అబాయా అని కూడా అంటారు. నికాబ్ అనేది ఒక రకమైన క్లాత్ మాస్క్. ఇది ముఖంపై ఉంటుంది. ఇందులో మహిళ ముఖం కనిపించదు. కానీ కళ్లు మాత్రమే కనిపిస్తాయి.

1983 కర్టాటక ప్రభుత్వం విద్యాహక్కు చట్టం చట్టం ప్రకారం విద్యార్థులంతా యూనిఫాం(ఒకే తరహా దుస్తులు)ను ధరించాలి. సెక్షన్ 133(2) ప్రకారం ప్రభుత్వం పాఠశాలల్లో ఈ నిబంధన ఉండగా.. ప్రైవేట్ స్కూళ్లల్లో తమకు నచ్చిన యూనిఫాం ను ఎంచుకోవచ్చు. అయితే అధికారులు ఎంపిక చేసిన యూనిఫాం నే విద్యార్థులు ధరించాలి. అయితే అడ్మినిస్ట్రేటివ్ కమిటీ యూనిఫాం ఎంపిక చేయకపోతే సాధారణ దుస్తులను ధరించాలి. అయితే సమానత్వం, సమగ్రత, ప్రజా శాంతిభద్రతలకు భంగం కలిగించే రీతిలో మాత్రం ధరించకూడదు. అయితే కొన్ని విద్యాసంస్థల్లో తమకిష్టమొచ్చిన రీతిలో విద్యార్థులు దుస్తులు ధరించడంపై విద్యాశాఖ అభ్యంతరం తెలిపింది.

గత నెలరోజులుగా కర్టాటక రాష్ట్రంలోని ఉడుపి, చిక్కమగళూరుల్లోని విద్యాసంస్థల్లో విద్యార్థులు హిజాబ్స్ ధరిస్తూ తరగతులకు హాజరవుతున్నారు. దీంతో హిందూ సంఘాలు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అయితే హిజాబ్స్ ధరించిన విద్యార్థులు ఆ డ్రెస్ ధరించడం మా హక్కు అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆందోళనకు ప్రతిగా హిందూ మతానికి చెందిన విద్యార్థులు కాషాయ కండువాలతో స్కూళ్లకు వచ్చారు. అంతేకాకుండా ర్యాలీలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉడుపి కుండాపూర్లో కొందరు బాలబాలికలు కాషాయ కండువాలు ధరించి 'జై శ్రీరామ్' అంటూ నినాదాలు చేశారు.

ఈ వ్యవహారంపై కొందరు కోర్టుకు వెళ్లారు. దీనిపై ఈనెల 8న విచారణ చేపట్టనున్నారు. ఇంతలో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మె విద్యాశాఖ, న్యాయశాఖతో సంప్రదింపులు జరిపి శనివారం సాయంత్రం కీలక ఉత్తర్వలు జారీ చేశారు. అయితే అటు రాజకీయ పార్టీల మధ్య రగడ మొదలైంది. హిజాబ్ ధరిస్తే 'తాలిబనైజేషన్' ను ప్రోత్సహించినట్లవుతుందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఆర్ ఎస్ఎస్ పై మండిపడుతున్నారు. కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ ప్రభుత్వం కావాలనే చేస్తోందన్నారు. అయితే హెచ్ డీ కుమారస్వామి మాత్రం ఇప్పటి వరకు అనుమతించిన ప్రదేశాల్లో హిజాబ్ కు అనుమతివ్వండి.. కొత్తగా ప్రవేశపెట్టిన చోటల నిషేధించండి.. అని అన్నారు.

-కర్ణాటక సర్కార్ కీలకనిర్ణయం.. స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజుల సెలవులు
హిజాబ్ వివాదం నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం తాజాగా అప్రమత్తమైకీలక నిర్ణయం తీసుకుంది. కాలేజీలు,స్కూళ్లలో విద్యార్థుల మధ్య యుద్ధవాతావరణాన్నితలపించేలా ఘర్షణలు జరుగుతున్న పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలకు మూడు రోజులు సెలవులు ఇస్తున్నట్టు కర్ణాటక సీఎం బస్వరాజు బొమ్మై ప్రకటించారు. అందరూ శాంతియుతంగా ఉండాలని.. ఈ అంశంపై హైకోర్టు తీర్పు వచ్చే వరకూ ఆందోళనలు వద్దని సీఎం కోరారు.