Begin typing your search above and press return to search.

4.5 కోట్లకు మోసపోయిన స్టార్ క్రికెటర్ భార్య!

By:  Tupaki Desk   |   13 July 2019 8:25 AM GMT
4.5 కోట్లకు మోసపోయిన స్టార్ క్రికెటర్ భార్య!
X
తనను తన వ్యాపార భాగస్వామ్యులు మోసం చేశారని అంటోంది ఆరతి సెహ్వాగ్. టీమిండియాకు ఒకప్పటి డ్యాషింగ్ ఓపెనర్ అయిన సెహ్వాగ్ భార్య ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మొత్తం ఎనిమిది మంది వ్యాపార భాగస్వామ్యులు తనను మోసం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.

వారు తనను నాలుగున్నర కోట్ల రూపాయలకు మోసం చేశారని ఆమె తన ఫిర్యాదులో వివరించింది. వ్యాపార భాగస్వామ్యులతో కలిసి ఒక ఆగ్రో బిజినెస్ చేపట్టిందట సెహ్వాగ్ భార్య. ఆ వ్యాపారంలో భాగంగా తన పార్ట్ నర్లు తన ప్రమేయం లేకుండా భారీ మొత్తం లోన్ తీసుకున్నారట. దానికోసమని వారు తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్టుగా ఆమె ఆరోపించింది.

తనకు తెలియకుండా తనపై నాలుగున్నర కోట్ల రూపాయల అప్పును మోపారని ఆమె అంటోంది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు మోసం జరిగిందని సెహ్వాగ్ సతీమణి ఆరోపించింది.