Begin typing your search above and press return to search.

న్యూజిలాండ్​ తో మేము ఓడిపోతే.. పిచ్​ల గురించి ఎవరూ మాట్లాడలేదు..!

By:  Tupaki Desk   |   4 March 2021 3:58 AM GMT
న్యూజిలాండ్​ తో మేము ఓడిపోతే.. పిచ్​ల గురించి ఎవరూ మాట్లాడలేదు..!
X
ఇండియా పిచ్​లపై వస్తున్న విమర్శలపై టీమిండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ తనదైన రీతిలో స్పందించారు. విమర్శకులకు గట్టిగా కౌంటర్​ ఇచ్చారు. ఇటీవల మొతేరా పిచ్​ వేదిక గా జరిగిన డే అండ్​ నైట్​ మ్యాచ్​ కేవలం రెండ్రోజుల్లోనే ముగియడంపై ఇంగ్లాండ్​ మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఆ పిచ్ అధ్వానంగా ఉందని మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ స్పందించారు. గత ఏడాది న్యూజిలాండ్​తో జరిగిన టెస్ట్​ మ్యాచ్​ లో భారత జట్టు ఓడి పోయింది. అప్పుడు కూడా కేవలం మూడు రోజుల్లోనే మ్యాచ్​ ముగిసింది. అప్పుడెవరూ పిచ్​ గురించి మాట్లాడలేదు.. కానీ ఇప్పుడు ఇండియా గెలిచేసరికి పిచ్​ ల ప్రస్తావన తీసుకొస్తున్నారు. అప్పుడేమో ఇండియన్​ బ్యాట్స్​మన్​ ఫెయిల్​ అయ్యారు.. అన్నారు. ఇప్పుడు పిచ్​లు బాగాలేవు అంటున్నారు.. ఇదేం ద్వంద్వ నీతి అంటూ విరాట్​ కోహ్లీ స్పందించారు.భారత్​ ఇంగ్లాండ్ జట్ల మధ్య గురువారం నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో విరాట్​ మీడియాతో మాట్లాడారు. ‘మ్యాచ్​ ఎవరైనా గెలవడం కోసం ఆడతారు.. అంతేకాని ఐదురోజులు ఆడాలని ఆడరు. మ్యాచ్​ ను నిలబెట్టడం బ్యాట్స్​మెన్​ నైపుణ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంతేకాని పిచ్​ ల గురించి ప్రస్తావన తేవడం అంటే అది సాకులను వెదకడం మాత్రమే’ అని విరాట్​ అన్నారు. పిచ్​ ల గురించి పదే పదే ప్రస్తావన తీసుకు రావడం మంచిది కాదని విరాట్​ పేర్కొన్నారు.