Begin typing your search above and press return to search.

పోలీసుల‌ను చంపి కాల్చాల‌నుకున్నా:

By:  Tupaki Desk   |   10 July 2020 5:43 AM GMT
పోలీసుల‌ను చంపి కాల్చాల‌నుకున్నా:
X
ఉత్తర‌ప్రదేశ్‌ లోని కాన్పూర్ ఎన్‌ కౌంటర్‌ లో 8 మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో ముఖ్య నిందితుడు - గ్యాంగ్‌ స్టర్ వికాస్ దుబే. వికాస్ దుబే 2001 లో రాష్ట్ర మంత్రి సంతోష్ శుక్లా హత్య కేసులో ప్రధాన నిందితుడు. 2004 లో కేబుల్ వ్యాపారవేత్త దినేష్ దుబే హత్య కేసులో కూడా వికాస్ నిందితుడు. ఇటీవ‌ల పోలీసుల హ‌త్య అనంత‌రం అత‌డి ని మధ్యప్రదేశ్‌ లోని ఉజ్జయిని లోని మహాకల్ ఆలయం నుంచి అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత పోలీసులు అతడిని విచారించారు. ఈ విచార‌ణ‌ లో అతడు చాలా సంచ‌ల‌న విష‌యాలు పోలీసుల‌కు చెప్పాడు.

పోలీసుల నుంచి త‌మ‌కు ముందుగానే సమాచారం అందింద‌ని వికాస్ దుబే తెలిపాడు. పోలీసులను హ‌త్య చేసిన తరువాత మృత దేహాలను తగలబెట్టాలని భావించినట్లు చెప్పారు. మృతదేహాలను దహనం చేయడానికి ఒకే చోటకు చేర్చి అంటించేందుకు పెట్రోల్ కూడా ఏర్పాటు చేశామని వివ‌రించాడు. అయితే పోలీసుల తో అత‌డు సన్నిహితం గా ఉండడం పై పోలీసులు ప్ర‌శ్నించారు. దాని పై కూడా వివ‌రంగా చెప్పుకొచ్చాడు.

త‌న‌ను ఎన్‌కౌంట‌ర్ చేస్తార‌నే స‌మాచారం ఉదయం త‌న‌కు అందిందని, పోలీసులు ఎన్‌ కౌంటర్ చేస్తారనే భయం తో దాడులకు దిగినట్లు చెప్పాడు. అయితే వికాస్ దుబే పోలీసుల చేతి లో ఎన్‌ కౌంట‌ర్ అయ్యాడు.