Begin typing your search above and press return to search.

పప్పూ.. బాబు డబుల్ వెధవ.. వంశీ తిట్ల దండకం

By:  Tupaki Desk   |   16 Nov 2019 4:47 AM GMT
పప్పూ.. బాబు డబుల్ వెధవ.. వంశీ తిట్ల దండకం
X
పప్పూ, వెధవ.. ఇలా నోటికొచ్చినట్టు తిట్టేశాడు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఇటీవలే టీడీపీ నుంచి బయట కు వచ్చిన ఆయన అదే టీడీపీ అధినేత, ఆయన పుత్రరత్నం పై ఇంత దారుణం గా తిట్టడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.

ఇటీవలే తెలుగుదేశం పార్టీ కి , ఎమ్మెల్యే పదవి కి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నిప్పులు చెరిగారు. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై వ్యక్తిగత దూషణల తో మాటల దాడి చేశాడు. తను రాజీనామా చేస్తే అవకులు, చవాకులు పేలుస్తున్న టీడీపీ నేతలను కడిగి పారేశాడు.

వల్లభనేని వంశీ మాట్లాడుతూ.. తన గురించి టీడీపీ సోషల్ మీడియా లో ఇష్టా రాజ్యంగా ప్రచారం చేస్తున్నారని.. ఈ విషయాన్ని గతంలో చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకో లేదని వంశీ వా పోయాడు. అందుకే తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు. నేను తప్పు చేస్తే సన్నాసినేనని.. కానీ చంద్రబాబు మాత్రం డబుల్ సన్నాసి, నేను వెధవ అయితే బాబు డబుల్ వెధవ అంటూ చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపించారు. గన్నవరానికి పప్పు వస్తాడో.. ఆయన బాబు చంద్రబాబు వస్తాడో తేల్చుకోవాలన్నారు.

తాను చేస్తున్నది పార్టీకి ద్రోహం అయితే నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న చంద్రబాబు టీడీపీ లో చేరి కాంగ్రెస్ కు చేసింది ద్రోహం కాదా అని ప్రశ్నించారు.కేసులకు భయపడి వైసీపీ లో చేరుతున్నానని విమర్శలు చేస్తున్నారని.. తన పై ఓటుకు నోటు కేసు లేదన్నారు. చంద్రబాబు చేస్తే సంసారం.. మేము చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు. చంద్రబాబు చరిత్ర ఒక పెద్ద సినిమా గానే తీయవచ్చు అని హెచ్చరించారు వంశీ. చంద్రబాబు తండ్రి ఖర్జూర నాయుడు, మైసూర్ మహారాజు కాదని ఇంత ఏలా సంపాదించాడని ప్రశ్నించాడు.

జూనియర్ ఎన్టీఆర్ విషయం లో పప్పు అ భ్రదత భావానానికి లోనవుతున్నాడని.. పార్టీ కోసం చంద్రబాబు చేసింది ఏంటని వంశీ బూతులు అందుకున్నాడు. మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబు ది అని ఆరోపించారు. పప్పూ బరువు మోయలేక టీడీపీ పడవ మునిగి పోతుందని ధ్వజమెత్తారు.

నాకు పప్పుగాడి లా గాడిద పదవుల మీద వ్యామోహం లేదని.. వాళ్లేంటి నాకు షోకాజ్ నోటీసులు ఇచ్చేదని ధ్వజమెత్తారు. బాబు ఇసుక దీక్షకు ఎమ్మెల్యే లే రాలేదని.. అందులో ఎంతమంది కొనసాగుతారో తెలియదని వంశీ పేర్కొన్నారు. టీడీపీలో తనతో మొదలైన ఉద్యమం ఇంకా కొనసాగుతుందని.. టీడీపీ లో ఉంటే పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచుతుందని వంశీ అభిప్రాయపడ్డారు.ఇలా వంశీ బూతులతో తిట్ల దండకంతో ఏపీ రాజకీయం హాట్ హాట్ గా మారింది.