Begin typing your search above and press return to search.
బిచ్చగాళ్లకు వ్యాక్సిన్ ... కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు !
By: Tupaki Desk | 27 July 2021 7:00 PM ISTకరోనా వైరస్ మహమ్మారి మన దేశంలో విలయతాండవం చేస్తుంది. దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టినా కూడా థర్డ్ వేవ్ ముప్పు పంచుకు కూర్చుంది అని నిపుణులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అలాగే దేశంలో ఇంకా ముప్పై వేల వరకు కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక దేశంలో మరోవైపు కరోనా మహమ్మారి ని కట్టడి చేయడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా శరవేగంగా కొనసాగుతుంది. 18 ఏళ్లు పై బడిన వారందరికి దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతుంది. ఇక త్వరలోనే చిన్నపిల్లలకి కూడా వ్యాక్సిన్ ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అనుకున్నట్టు అన్ని జరిగితే చిన్నపిల్లలకి వచ్చే నెలలోనే వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే .. కరోనా క్యారియర్లుగా వ్యవహరిస్తున్నవారిలో బిచ్చగాళ్లు కూడా ఉన్నారని, వారికి వ్యాక్సిన్ వెయ్యాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. కరోనా థర్డ్ వేవ్ రాకముందే బిచ్చగాళ్లకు వ్యాక్సినేషన్ చేయించాలని అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చెయ్యాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కుష్ కర్లా అనే వ్యక్తి. కుష్ కర్లా తరపున మోహిత్ పాల్ అనే లాయర్ ఈ పిటీషన్ వేశారు. థర్డ్ వేవ్ వస్తే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రం అయ్యే పరిస్థితి ఉండగా.. బిచ్చగాళ్ళు, వీధివాసులకు పునరావాసం కల్పించాలని, వ్యాక్సిన్ లను వేయాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వంకి నోటీసులు జారీ చేసింది.
ఈ విషయంలో సహాయం చేయమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరిన సుప్రీం కోర్టు, ఇది ఒక సామాజిక-ఆర్థిక సమస్య కనుక ఏ బిచ్చగాడిని వీధుల్లోకి అనుమతించకూడదనే అభిప్రాయాన్ని తీసుకోలేమని స్పష్టం చేశారు. జస్టిస్ డివై చంద్రచూడ్ మరియు ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విద్య మరియు ఉపాధి లేకపోవడం వల్ల, ప్రజలు సాధారణంగా కొంత ప్రాధమిక జీవనోపాధి కోసం వీధుల్లో అడుక్కునే పరిస్థితి వస్తుంది. సుప్రీంకోర్టుగా, వీధుల్లో బిచ్చగాళ్ళు ఉండకూడదని భావించొచ్చు కానీ, ఉండకూడదు అని మాత్రం ఆదేశించలేము అని ధర్మాసనం తెలిపింది. అయితే, బిచ్చగాళ్ళు మరియు వీధివాసుల పునరావాసం, వారికి వ్యాక్సిన్లు వేయడం గురించి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని, ఈ విజ్ఞప్తిపై రెండు వారాల్లోగా స్పందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని నోటీసులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే .. కరోనా క్యారియర్లుగా వ్యవహరిస్తున్నవారిలో బిచ్చగాళ్లు కూడా ఉన్నారని, వారికి వ్యాక్సిన్ వెయ్యాలంటూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. కరోనా థర్డ్ వేవ్ రాకముందే బిచ్చగాళ్లకు వ్యాక్సినేషన్ చేయించాలని అందుకు తగ్గట్టుగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చెయ్యాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కుష్ కర్లా అనే వ్యక్తి. కుష్ కర్లా తరపున మోహిత్ పాల్ అనే లాయర్ ఈ పిటీషన్ వేశారు. థర్డ్ వేవ్ వస్తే కరోనా వైరస్ మహమ్మారి తీవ్రం అయ్యే పరిస్థితి ఉండగా.. బిచ్చగాళ్ళు, వీధివాసులకు పునరావాసం కల్పించాలని, వ్యాక్సిన్ లను వేయాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వంకి నోటీసులు జారీ చేసింది.
ఈ విషయంలో సహాయం చేయమని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరిన సుప్రీం కోర్టు, ఇది ఒక సామాజిక-ఆర్థిక సమస్య కనుక ఏ బిచ్చగాడిని వీధుల్లోకి అనుమతించకూడదనే అభిప్రాయాన్ని తీసుకోలేమని స్పష్టం చేశారు. జస్టిస్ డివై చంద్రచూడ్ మరియు ఎంఆర్ షాలతో కూడిన ధర్మాసనం విద్య మరియు ఉపాధి లేకపోవడం వల్ల, ప్రజలు సాధారణంగా కొంత ప్రాధమిక జీవనోపాధి కోసం వీధుల్లో అడుక్కునే పరిస్థితి వస్తుంది. సుప్రీంకోర్టుగా, వీధుల్లో బిచ్చగాళ్ళు ఉండకూడదని భావించొచ్చు కానీ, ఉండకూడదు అని మాత్రం ఆదేశించలేము అని ధర్మాసనం తెలిపింది. అయితే, బిచ్చగాళ్ళు మరియు వీధివాసుల పునరావాసం, వారికి వ్యాక్సిన్లు వేయడం గురించి కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని, ఈ విజ్ఞప్తిపై రెండు వారాల్లోగా స్పందించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని నోటీసులు జారీ చేసింది.
