Begin typing your search above and press return to search.
వ్యాక్సిన్ భారం సంపన్నులపైనే..! నిర్మలమ్మ ఎత్తులు..!
By: Tupaki Desk | 12 Jan 2021 12:15 PM ISTకరోనా ఎఫెక్ట్తో అన్నిదేశాలు ఆర్థికంగా కుంగిపోయాయి. మనదేశం కూడా ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ త్వరలో ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే కోవిషీల్డ్, కోవాగ్జిన్ అత్యవసర పంపిణీకి అనుమతులు వచ్చేశాయి. ఈ క్రమంలో ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభించబోతున్నారు. దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ మరింత భారం కానున్నది. అయితే ఈ వ్యాక్సినేషన్ భారాన్ని సంపన్నులమీద, కంపెనీల మీద వేయాలని ఆర్థికశాఖ యోచిస్తున్నదట.
ఇందుకోసం వ్యాక్సిన్ సెస్ వేయాలని ప్రణాళికలు రచిస్తున్నదట. ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్కు ముందే సంపన్నులపై వ్యాక్సిన్ సెస్ వేయాలని కేంద్రం యోచిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ కోసం (లాజిస్టిక్ ఖర్చులు సహా) రూ.60,000-65,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కేంద్రం యోచిస్తున్నది. అయితే ఈ మొత్తాన్ని సంపన్నుల మీద మోపాలని కేంద్రం యోచిస్తున్నదట. అయితే కేంద్రం నిర్ణయాన్ని ఇప్పటికే పలు కంపెనీలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.
కరోనా ఎఫెక్ట్తో బిజినెస్ నడవక ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో కరోనా సెస్ వేయడం సరికాదని వాళ్లు అంటున్నారట. అయితే కేంద్రం ముందు ప్రస్తుతం మరో మార్గం లేదు. వ్యాక్సినేషన్ కొనసాగించాలంటే పన్ను విధించాల్సిందే. అయితే కరోనా ఎఫెక్ట్తో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలు కేంద్రం నిర్ణయాన్ని ఎలా తీసుకుంటాయో వేచి చూడాలి. మరోవైపు ఇంధనం పై కూడా పన్ను విధించాలని కేంద్రం యోచిస్తున్నదట.
ఇందుకోసం వ్యాక్సిన్ సెస్ వేయాలని ప్రణాళికలు రచిస్తున్నదట. ఫిబ్రవరి 1న బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెట్కు ముందే సంపన్నులపై వ్యాక్సిన్ సెస్ వేయాలని కేంద్రం యోచిస్తోంది. కరోనా వ్యాక్సినేషన్ కోసం (లాజిస్టిక్ ఖర్చులు సహా) రూ.60,000-65,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని కేంద్రం యోచిస్తున్నది. అయితే ఈ మొత్తాన్ని సంపన్నుల మీద మోపాలని కేంద్రం యోచిస్తున్నదట. అయితే కేంద్రం నిర్ణయాన్ని ఇప్పటికే పలు కంపెనీలు వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం.
కరోనా ఎఫెక్ట్తో బిజినెస్ నడవక ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో కరోనా సెస్ వేయడం సరికాదని వాళ్లు అంటున్నారట. అయితే కేంద్రం ముందు ప్రస్తుతం మరో మార్గం లేదు. వ్యాక్సినేషన్ కొనసాగించాలంటే పన్ను విధించాల్సిందే. అయితే కరోనా ఎఫెక్ట్తో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న కంపెనీలు కేంద్రం నిర్ణయాన్ని ఎలా తీసుకుంటాయో వేచి చూడాలి. మరోవైపు ఇంధనం పై కూడా పన్ను విధించాలని కేంద్రం యోచిస్తున్నదట.
