Begin typing your search above and press return to search.

భారత్ కు అమెరికా హెచ్చరిక .. ఆందోళన లో భారత్ !

By:  Tupaki Desk   |   19 Dec 2020 2:30 PM GMT
భారత్ కు అమెరికా హెచ్చరిక .. ఆందోళన లో భారత్ !
X
ఇండియాకు అమెరికా హెచ్చరికలు జారీచేసింది. అమెరికా నూతన అధ్యక్షుడిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయడానికి కొన్ని రోజుల ముందు ఈ ఉదంతం చోటుచేసుకుంది. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదని భారత్‌తోపాటు ఇతర దేశాలను అమెరికా హెచ్చరించింది. భారత్ తో పాటుగా మిత్రదేశాలకి కూడా అమెరికా హెచ్చరికలు జారీచేసింది. అమెరికా చర్యలతో రష్యా నుంచి గణనీయంగా ఆయుధాలను కొనుగోలు చేసే భారత్‌కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. అమెరికా విదేశాంగ శాఖ రాజకీయసైనిక వ్యవహారాల సహ కార్యదర్శి క్లార్కీ కూపర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో రష్యా నుంచి రక్షణ పరికరాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేయకుండా భాగస్వాములను హెచ్చరిస్తున్నాం అది ఆంక్షల ముప్పుకు దారితీస్తుంది అని అన్నారు.

రష్యా నుంచి ఎస్‌400 ట్రింఫ్ యాటీ మిస్సైల్ వ్యవస్థను కొనుగోలు చేసిన టర్కీపై కూడా అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ సాంక్షన్స్ యాక్ట్ కింద టర్కీపై పలు ఆంక్షలు విధించినట్లు ఇంటర్నేషల్ సెక్యూరిటీ అండ్ నాన్ ‌ప్రోలిఫరేషన్ అసిస్టెంట్ సెక్రటరీ క్రిస్టోఫర్ ఫోర్డ్‌ ప్రకటించారు. ఈ చట్టం కింద టర్కీకి చెందిన మిలిటరీ ఆయుధాల సేకరణ సంస్థ ఎస్ ఎస్ ‌బీ, నలుగురు అధికారులపై ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని అన్ని దేశాలు గుర్తించి రష్యా నుంచి ఆయుధాల కొనుగోళ్లను నిలిపేయాలని, లేదంటే సీఏఏటీఎస్ ఏ సెక్షన్ 231 కింద ఆంక్షలు తప్పవని ఫోర్డ్ హెచ్చరించారు.

ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల ఎస్‌-400 క్షిపణి వ్యవస్థను రష్యా నుంచి కొనుగోలుకు 2018లో భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వచ్చే ఏడాది వేసవి నాటికి వీటిని భారత్‌ కి అందజేయనున్నట్టు రష్యా ఇటీవల ప్రకటించింది. ఈ సమయంలో ఆంక్షల చట్టం ద్వారా విరోధులను ఎదుర్కొడానికి అమెరికా తన భాగస్వామ్య దేశాలకు హెచ్చరికలు చేయడం ఆందోళన కలిగిస్తోంది.ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడంలో భారత్‌కు రష్యా ప్రధాన వనరుగా ఉంది. దశాబ్దాలుగా ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాలు కొనసాగుతున్నాయి

రష్యాను లక్ష్యంగా చేసుకోలేదని చెప్పడానికి క్లార్కీ ప్రయత్నించారు. ‘ఈ సమయంలో ప్రపంచానికి స్పష్టమైన సందేశాన్ని పంపాలి.. ప్రమాదకరమైన సైబర్ కార్యకలాపాలు, ఉక్రెయిన్‌ లో ఆమోదయోగ్యంకాని చర్యలు, ప్రపంచవ్యాప్తంగా ఇతర హానికారక కార్యకలాపాలకు ప్రతిస్పందనగా రష్యాపై ఆంక్షలు విధించడానికి సీఏఏటీఎస్ఏను రూపొందించాం అన్నారు. తమ ఆంక్షల రక్షణ ఉత్పత్తుల విడి భాగాలు, నిర్వహణ దిగుమతులపై ఎటువంటి ప్రభావం చూపవు.. రష్యాకు ప్రత్యామ్నాయంగా ఓ వారధిగా ఉండాలని భావిస్తున్నాం. అందువల్ల సీఏఏటీఎస్ ఏ కఠినంగా అమలుపై దృష్టి పెట్టడం లేదు.. ఇదే విషయాన్ని పదే పదే స్పష్టం చేశాం అన్నారు. అమెరికా తక్షణమే ఆంక్షలు విధించాల్సిన అవసరం లేదు.. అలాగే, ఆంక్షలపై మా నిర్ణయంలో మార్పు ఉండదని కూపర్ స్పష్టం చేశారు. దీంతో రష్యా నుంచి ఆయుధాల కొనుగోళ్ల విషయంలో భారత్ ముందుకు వెళ్లడం కష్టతరమవుతుంది.