Begin typing your search above and press return to search.

జైట్లీ బ‌డ్జెట్‌ ను సిం'ఫుల్' గా చెబితే..!

By:  Tupaki Desk   |   1 Feb 2018 9:39 AM GMT
జైట్లీ బ‌డ్జెట్‌ ను సింఫుల్ గా చెబితే..!
X
మ‌రో బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టారు కేంద్ర ఆర్థిక‌మంత్రి జైట్లీ. ఇంత‌కీ జైట్లీ త‌న బ‌డ్జెట్ ప్ర‌సంగంలో ఏం చెప్పారు. బ‌డ్జెట్ లెక్క‌ల్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇంత‌కీ జైట్లీ బ‌డ్జెట్ లో ఏముంది అన్న విష‌యంలోకి వెళితే..జైట్లీ బ‌డ్జెట్ ను మొత్తంగా కొన్ని విభాగాలుగా చూస్తే ఆయ‌నేం చెప్పార‌న్న‌ది ఇట్టే అర్థ‌మైపోతుంది.

తెగ పొగిడేసుకున్నారు..

బ‌డ్జెట్ ప్ర‌సంగం ఆరంభంలోనే గ‌డిచిన సంవ‌త్స‌రాల్లో మోడీ స‌ర్కారు ఎలా ప‌ని చేసింద‌న్న విష‌యంపై త‌మ‌ను తాము పొగిడేసుకున్నారు జైట్లీ. మోడీ స‌ర్కారు హ‌యాంలో వ్య‌వ‌స్థీకృత సంస్క‌ర‌ణ‌లు భారీ ఎత్తున అమ‌ల‌వుతున్న‌ట్లు చెప్పారు. కొత్త భార‌త్ ను ఆవిష్కరిస్తున్న‌ట్లు చెప్పిన ఆయ‌న‌..7శాతం వృద్ధిరేటును సాధిస్తున్న‌ట్లు చెప్పారు. ప్ర‌పంచంలో వేగ‌వంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భార‌త్ మారింద‌ని చెప్పారు. తాము ప‌వ‌ర్లోకి వ‌చ్చే నాటికి ప‌రిస్థితులు వేరుగా ఉన్నాయ‌ని.. వాటిని తాము మార్చిన‌ట్లుగా చెప్పుకున్నారు. జీఎస్టీ కార‌ణంగా దేశానికి మేలు జ‌రిగిన‌ట్లుగా చెప్పుకున్నారు.

వ్య‌వ‌సాయం.. గ్రామీణానికి పెద్ద‌పీట‌

ఎన్నిక‌లు మ‌రో ఏడాదికి వ‌చ్చేయ‌టం.. అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ ఏడాది చివ‌ర్లోనే ముంద‌స్తుకు వెళ్లే ఆలోచ‌న‌లో ఉన్న మోడీ స‌ర్కారు.. ఇప్ప‌టికే త‌మ‌కు ప‌ట్టున్న ప‌ట్ట‌ణ‌ప్రాంతాల‌తో పాటు.. అంత‌గా ప‌ట్టులేని గ్రామీణ భార‌తంలో మోడీ ముద్ర పడేందుకు వీలుగా బ‌డ్జెట్ ప్ర‌తిపాద‌న‌ల్ని సిద్ధం చేశారు. వ్య‌వ‌సాయానికి పెద్ద పీట వేయ‌టంతో పాటు.. రైతుల సంక్షేమం విష‌యంలో త‌మ స‌ర్కారు ఎంత క‌మిట్ మెంట్ తో ఉంద‌న్న విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.
పంట కొనే విషయంలో రాష్ట్రాలతో మాట్లాడి ఓ వ్యవస్థ ఏర్పాటు చేస్తాం. పెట్టుబడికి ఒకటిన్నర రెట్లు ఉండేలా మద్ధతు ధర నిర్ణయిస్తాం. వ్యవసాయ ఎగుమతులను సరళీకృతం చేస్తున్నాం. ఆర్గానిక్‌ వ్యవసాయానికి కేంద్రం తోడ్పాటును అందిస్తుంది. ఫుడ్‌ ఫ్రాసెసింగ్‌ కోసం 42 కేంద్రాలు ఏర్పాటు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు రూ.1400 కోట్లు. వ్యవసాయ మార్కెట్‌ల అభివృద్ధికి రూ.2000 కోట్లు. ఆర్గానిక్‌ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. జాలర్లకు క్రెడిట్‌ కార్డులు. ఆపరేషన్‌ గ్రీన్‌కు రూ.500 కోట్లు. వచ్చే ఏడాది వ్యవసాయ రుణాలకు రూ.11 లక్షల కోట్లు. కౌలు రైతులకు కూడా రుణాలు ఇచ్చేలా కొత్త విధానం. సాగునీటి కోసం నాబార్డుతో కలిసి ప్రత్యేక విధానం. చేపల పెంపకం, పశుసంవర్థకానికి రూ.10వేల కోట్లు.

ఎస్సీ..ఎస్టీల‌కు అంతంతే..!

ఎస్సీ..ఎస్టీల సంక్షేమానికి బ‌డ్జెట్ లో పెద్ద‌గా ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. ఎస్సీ..ఎస్టీల సంక్షేమానికి రూ.1.05ల‌క్ష‌ల కోట్లు కేటాయిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమ నిధికి 50శాతం నిధుల పెంపుగ్రామీణ ప్రాంతంలోని పేదలకు ఉచిత విద్యుత్‌ కోసం రూ.16 వేల కోట్లు

విద్య‌.. ఆరోగ్యం

విద్యా.. ఆరోగ్యానికి పెద్ద‌పీట వేశారు. అన్నింటికి మించి ఎన్నిక‌ల బ‌డ్జెట్ కావ‌టంతో భారీ ఆరోగ్య బీమా ప‌థ‌కాన్ని ప్ర‌క‌టించారు. త‌క్కువ మొత్తాన్ని ప్రీమియంగా చెల్లించిన కుటుంబానికి రూ.5ల‌క్ష‌ల మేర ఆరోగ్య బీమా సౌక‌ర్యం క‌ల్పించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌టం ద్వారా.. కొత్త త‌ర‌హా తాయిలానికి తెర తీసిన‌ట్లుగా చెప్పాలి.

విద్య‌

+ కొత్తగా 18 ఆర్కిటెక్చర్‌ కాలేజీలు

+ స్కూల్‌ టీచర్ల శిక్షణకు ప్రత్యేక స్కూళ్లు

+ డిజిటల్‌ విద్యావిధానానికి మరింత చేయూత. విద్యారంగంలో మౌలిక అభివృద్ధికి రూ.లక్షకోట్లతో రైజ్‌ నిధి

+ విద్యాభివృద్ధి కోసం జిల్లా కేంద్రంగా ప్రణాళిక

+ ఈ ఏడాది నుంచి పీఆర్‌ఎఫ్‌(ప్రధానమంత్రి రిసెర్చ్‌ ఫెలోషిప్‌). టాప్‌ వెయ్యి మంది బీటెక్‌ విద్యార్థులు

+ నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు అన్ని రాష్ట్రాలతో కలిసి మేం పనిచేయటం.

వైద్యం

+ ఆరోగ్య రంగానికి భారీగా నిధులు. రూ.లక్షా 38 వేల కోట్ల నిధులు

+ ఆయుష్మాన్‌ భవ పథకంతో అందరికీ ఆరోగ్యం. ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు హెల్త్‌ స్కీం (ఆయుష్మాన్‌ భవ పథకం). రూ.330 చెల్లిస్తే కుటుంబానికి బీమా. ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ ఆరోగ్య భద్రతా పథకం.. పది కోట్ల మందికి లబ్ధి.

+ జీవన ప్రమాణ పెంపునకు పైలెట్‌ ప్రాజెక్టు కింద 116 జిల్లాలు ఎంపిక

+ టీబీ పేషెంట్ల సరంక్షణకు రూ.670 కోట్లతో ప్రత్యేక నిధి

+ ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలుగా అభివృద్ధి

+ కొత్తగా 24 మెడికల్‌ కాలేజీలకు అనుమతి

+ ప్రతి మూడు పార్లమెంటరీ స్థానాలకు కలిపి కనీసం ఒక ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు

+ టీబీ రోగులకు వైద్యం సమయంలో నెలకు రూ.500

ఉపాధి

+ గ్రూప్‌ సీ, డీలలో ఇంటర్వ్యూలను రద్దు.

ప‌రిశ్ర‌మ‌లు

+ పరిశ్రమలకు ఆధార్‌ తరహా మరో కార్డులు. పరిశ్రమలకు ఆన్‌లైన్‌ ద్వారా మరిన్ని రుణాలు

+ అమృత్‌ ప్రోగ్రాం కింద 500 నగరాలకు నీటి సరఫరా. ఇప్పటికే 494 కాంట్రాక్టులకోసం రూ. 19,428 కోట్లు

+ 10 ప్రముఖ పర్యాటక ప్రాంతాలు గుర్తించి వాటిని మరింత అభివృద్ధి చేయటం.

+ ముద్ర యోజనఫండ్ కోసం రూ.3లక్షల కోట్లు

వివిధ రంగాల‌కు కేటాయింపులు

= భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా 9 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తి చేస్తాం

= దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీల కింద 99 నగరాలు ఎంపిక. రెండు లక్షల కోట్లు కేటాయింపు.

= జౌళి రంగానికి రూ.7148 కోట్లు

= చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు రూ.3794 కోట్లు

= కార్పోరేట్‌ పన్ను 2శాతం తగ్గింపు

= వచ్చే మూడేళ్లకుగాను భవిష్యనిధికి 12శాతం నిధులు చెల్లింపు

= దిగువ తరగతి వారికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద 50 లక్షల ఇళ్ల నిర్మాణం లక్ష్యం

= ఉజ్వల పథకం కింద 8 కోట్ల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు

= ప్రధానమంత్రి సౌభాగ్య యోజనకు రూ.1600 కోట్లు

విమానాశ్ర‌యాలు

- ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు ప్రస్తుతం 124 ఎయిర్‌పోర్ట్‌లు ఉండగా వాటిని 5 రెట్లు పెంచనున్నాం. ఏడాదికి - బిలియన్‌ ట్రిప్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నాం

ఉడాన్‌ (ఉడే దేశ్‌ కా ఆమ్‌ నాగరిక్‌) పథకం ద్వారా 56 అన్‌ రిజర్వడ్‌ ఎయిర్‌పోర్ట్‌ల, 31 అన్‌ సర్వడ్‌ హెలిప్యాడ్ల అనుసంధానం

రైల్వేలు

+ రైల్వే భద్రతకు పెద్ద పీట, సాంకేతిక పరిజ్ఞానం. రైల్వేకు రూ.1,48,000కోట్లు కేటాయింపు

+ 18 వేల కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ డబ్లింగ్‌ పనులకు నిధులు కేటాయింపు

+ దేశ వ్యాప్తంగా 600 రైల్వే స్టేషన్లు గుర్తించి వాటి అభివృద్ధి

+ 36 వేల కిలో మీటర్ల మేర రైల్వే లైన్‌ల పునరుద్ధరణ

+ 4వేల కిలో మీటర్ల మేర కొత్తగా రైల్వే మార్గం

+ దేశ‌వ్యాప్తంగా 25 వేలమంది ప్రయాణీకులు వచ్చే రైల్వే స్టేషన్లలో ఎస్కలేటర్ల ఏర్పాటు

+ అన్ని రైల్లే స్టేషన్లలో వైఫై, సీసీటీవీల ఏర్పాటు

+ రైళ్ల ఆధునీకరణకు ముందడుగు. కొత్తగా రైల్వేలకు 12,000 వ్యాగన్లు, 5160కోచ్‌లు, 700 లోకోమోటివ్స్‌.

+ బెంగ‌ళూరు మెట్రోకు రూ.18వేల కోట్లు

+ ముంబ‌యి స‌బ‌ర్బ‌న్ కు రూ.15వేల కోట్లు

జీతాల పెంపు

+ రాష్ట్రపతి వేతనం రూ.5లక్షలు, ఉపరాష్ట్రపతి వేతనం 4లక్షలు, గవర్నర్‌ వేతనం రూ.3.5లక్షల వేతనం

+ ప్రతి ఐదేళ్లకొకసారి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వేతనాలపై సమీక్ష

+ ఎంపీల జీతాల పెంపుపై రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటు. ప్రతి ఐదేళ్లకొకసారి ఎంపీల వేతనం పెంపు

వ్య‌క్తిగ‌త ఆదాయ‌ప‌న్నుకు మొండిచేయి

ఆదాయ పన్ను పరిధిలోకి కొత్తగా ఐదు లక్షల మంది వ‌చ్చారు. కొత్తగా 81లక్షల ఐటీ రిటర్న్స్‌ దాఖలయ్యాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిలో ఎలాంటి మార్పు లేదు. వ్యక్తిగత పన్ను శ్లాబులు యధాతథం. గ‌త ఏడాది కంటే అద‌నంగా రూ. 90 వేల కోట్ల పన్ను వసూలైంది.

ప‌న్నుల లెక్క‌లు..

= గత ఏడాది ప్రత్యక్ష పన్నులు 12.6శాతం పెరిగాయి

= గత ఏడాది పన్ను చెల్లించే వారి సంఖ్య ఏకంగా 40శాతం పెరిగింది

= దేశంలో ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య 85కోట్ల 51లక్షలకు చేరిం ది

= కార్పొరేట్‌ ట్యాక్స్‌ 25శాతానికి పెంపు.. దీని ద్వారా రూ.250 కోట్ల ఆదాయం ఆశిస్తున్నాం

= వచ్చే ఏడాది ద్రవ్యలోటును 3.3శాతానికి తగ్గిస్తాం

= ఈ ఏడాది దవ్యలోటు జీడీపీలో 3.5శాతం

సీనియ‌ర్ సిటిజ‌న్స్ కు తీపిక‌బురు

+ వృద్ధులకు బ్యాంకు డిపాజిట్ల ద్వారా వచ్చే వడ్డీ రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు

+ వృద్ధులకు రూ.50 వేల వరకు వైద్య ఖర్చులకు పన్ను మినహాయింపు. ఉద్యోగులకు రూ.40 వేల వరకు వైద్య ఖర్చులకు పన్ను మినహాయింపు.

వ‌రాలు వాత‌లు

+ జీడిప‌ప్పు రేటు త‌గ్గే అవ‌కాశం.

+ సిగిరెట్లు పెర‌గ‌టం ఖాయం

+ సెల్ ఫోన్లు 10 నుంచి 15 శాతం వ‌ర‌కు పెరిగే ప‌రిస్థితి.

+ టీవీ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి.

కొత్త‌గా జాబ్ చేరే వారికి స్వీట్ న్యూస్‌..

ఏ రంగంలోనైనా కొత్తగా ఉద్యోగంలో చేరేవారైనా.. రానున్న మూడేళ్ల‌ల్లో ప్రభుత్వమే 12శాతం ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్‌ చెల్లిస్తుంది. ఇన్నాళ్లూ మహిళా ఉద్యోగులు తమ జీతాల నుంచి చెల్లిస్తున్న 12శాతం పీఎఫ్‌ను 8శాతానికి తగ్గిస్తాం. 2018లో 70లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం.