Begin typing your search above and press return to search.

ఉండవల్లి అరుణ్ కుమార్ కు కరోనా

By:  Tupaki Desk   |   26 Aug 2020 11:06 PM IST
ఉండవల్లి అరుణ్ కుమార్ కు కరోనా
X
ఏపీలో కరోనా ఏమాత్రం తగ్గడం లేదు. విస్తృతంగా వ్యాపిస్తోంది. రోజుకు 10వేల కేసుల చొప్పున నమోదవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా కరోనాకు కేంద్రంగా మారుతోంది. ఆ జిల్లాలో రోజుకు 1000కంటే ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 82469కు చేరుకోగా.. ఇప్పటివరకు కరోనా బారినపడి 3541మంది ప్రాణాలు కోల్పోయారు.వీఐపీలను సైతం కరోనా వదలడం లేదు.

తాజాగా సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా కరోనా బారినపడ్డారు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

ప్రస్తుతం ఉండవల్లి రాజమండ్రిలో హోం ఐసోలేషన్ లో ఉన్నారు. తనను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.