Begin typing your search above and press return to search.

మహా ప్రస్థానంలో ఉమామహేశ్వరి అంత్యక్రియలు పూర్తి..

By:  Tupaki Desk   |   3 Aug 2022 10:23 AM GMT
మహా ప్రస్థానంలో ఉమామహేశ్వరి అంత్యక్రియలు పూర్తి..
X
దివంగత సీనియర్ ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి అంత్యక్రియలు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో పూర్తయ్యాయి. అంత్యక్రియల్లో బాలకృష్ణ, రామకృష్ణ, చంద్రబాబు, లోకేష్, దగ్గుబాటి, కంఠమనేని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

అంత్యక్రియల్లో సోదరి ఉమామహేశ్వరి పాడెను హీరో బాలకృష్ణ, రామకృష్ణ మోశారు. అంతిమ సంస్కారాలను ఉమామహేశ్వరి భర్త శ్రీనివాస్ పూర్తి చేశారు.ఉమా మహేశ్వరి మృతితో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆఖరి చూపుకోసం కుటుంబ సభ్యులు, బంధువులు అంతా తరలివచ్చారు.

ఉదయమే ఉమా మహేశ్వరి నివాసానికి చేరుకున్న చంద్రబాబు సహా కుటుంబ సభ్యులంతా ఓదార్చారు. సోదరి అంత్యక్రియాల్లో బాలకృష్ణ, రామకృష్ణ అన్నీ తామై వ్యవహరించారు.

రెండు రోజుల క్రితమే ఉమామహేశ్వరి తుదిశ్వాస విడిచినా.. అమెరికాలో ఉన్న కుమార్తె రాక కోసం ఆగారు. ఇవాళ అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు పూర్తి చేశారు.

కంఠమనేని ఉమామహేశ్వరి మృతి నందమూరి ఫ్యామిలీలో తీరని విషాదాన్ని నింపింది. ఇంకా ఆ బాధ నుంచి ఎవరూ కోలుకోలేకపోతున్నారు. మొన్న చెల్లెలు మరణవార్త తెలియగానే బాలకృష్ణ హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. పోస్టుమార్టం నుంచి మిగతా వ్యవహారాలన్నింటిని బాలయ్య దగ్గరుండి చూసుకున్నారు.

ఇక అనారోగ్య కారణాలతో ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారనే వార్త అందరినీ షాక్ కు గురిచేసింది. నందమూరి ఫ్యామిలీకి, సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. ఇవాళ జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేశారు.