Begin typing your search above and press return to search.

వెంక‌య్య నిర్ణ‌యంపై సుప్రీంకోర్టులో కేసు ప‌డింది

By:  Tupaki Desk   |   7 May 2018 4:01 PM IST
వెంక‌య్య నిర్ణ‌యంపై సుప్రీంకోర్టులో కేసు ప‌డింది
X

ఢిల్లీ వేదిక‌గా రాజ‌కీయం హాట్ హాట్‌ గా మారుతోంది. భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన తీర్మానం తోసిపుచ్చడంపై ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు ప్రతాప్ సింగ్ - అమీ హర్షద్రాయ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీజేఐపై అభిశంసన కోసం ఇచ్చిన తీర్మానాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇటీవల తిరస్కరించిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సహా ఏడు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన తీర్మానంపై న్యాయకోవిదుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వెంకయ్యనాయుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన విషయం విదితమే. అయితే రాజ్యసభ చైర్మన్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ వీరిద్దరూ సుప్రీంకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. రాజ్యసభ చైర్మన్ నిర్ణయం అప్రజాస్వామికమని ఎంపీలు పిటిషన్‌ లో పేర్కొన్నారు.

భారత అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిపై అభిశంసన కోసం ఇచ్చిన తీర్మానాన్ని ఉపరాష్ట్రపతి - రాజ్య‌స‌భ చైర్మ‌న్‌ వెంకయ్య నాయుడు గ‌త నెల‌లో తిరస్కరించారు. చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాను తొలగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ సహా ఏడు ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన అభిశంసన తీర్మానంపై న్యాయకోవిదుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత వెంకయ్యనాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. అభిశంసన నోటీసుపై కాంగ్రెస్ - సీపీఎం - సీపీఐ - ఎస్‌ పీ - ఎన్సీపీ - బీఎస్పీ - ముస్లిం లీగ్ సభ్యులు సంతకాలు చేశారు. మొత్తం ఐదు రకాల దుష్ప్రవర్తన ఆధారంగా ఈ నోటీసు తీసుకువచ్చాయి ప్రతిపక్ష పార్టీలు. ఇప్పటి వరకు పలువురు హైకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన తీర్మానాలు జారీ అయినప్పటికీ అసాధారణ రీతిలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నోటీసులు ఇవ్వడం ఇదే తొలిసారి. అయిన‌ప్పటికీ ఈ విష‌యంలో వెన‌క్కు త‌గ్గ‌ని విప‌క్షాలు తాజాగా మ‌రోమారు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించాయి.

సీజేఐపై ప్ర‌తిప‌క్షాలు ఆరోపణలు ఇవే...

* తనకున్న మాస్టర్‌ ఆఫ్‌ రోస్టర్‌ అధికారాలను దుర్వినియోగం చేస్తూ.. సున్నితమైన అంశాలను కొన్ని ప్రత్యేక ధర్మాసనాలకు కట్టబెట్టారు.

* ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కేసు విషయంలో ముడుపులు తీసుకున్నారు. ఇదే కేసులో రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు అనుమతివ్వలేదు.

* సుప్రీంకోర్టులో ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ పై విచారణకు సంబంధించిన పిటిషన్‌ను ముందు తేదీకి మార్చటం

* రాజ్యాంగ ధర్మాసనానికి తనే నేతృత్వం వహిస్తున్నప్పటికీ ప్రసాద్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కు సంబంధించిన విచారణను తన బెంచీకే కేటాయించటం సంప్రదాయానికి విరుద్ధం.

* న్యాయమూర్తిగా ఉన్నప్పుడు జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తప్పుడు అఫిడవిట్‌ తో ఓ స్థలాన్ని కొనుగోలు చేశారు. 2012లో తను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందినపుడు దీన్ని సరెండర్‌ చేశారు. అయితే 1985లోనే ప్లాట్‌ కేటాయింపు నిబంధనలు రద్దుచేశారు. అప్పటినుంచి వీటిని సీజేఐ ఉల్లంఘించారు.