Begin typing your search above and press return to search.

తిరుమల శ్రీవారి దర్శనం ఇకపై ఎలా ఉండబోతుందంటే ....!

By:  Tupaki Desk   |   18 May 2020 10:10 AM
తిరుమల శ్రీవారి దర్శనం ఇకపై ఎలా ఉండబోతుందంటే ....!
X
కలియుగ ప్రత్యక్ష దైవం ఆ తిరుమలేశుని దర్శన భాగ్యం కోసం ఎంతోమంది వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మహమ్మారి కారణంగా భక్తుల ఆరోగ్యం కోసం టీటీడీ ఆ శ్రీవారి దర్శనాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్న సంగతి తెలిసిందే. దాదాపుగా శ్రీవారి దర్శనం లేక 50 రోజులు దాటిపోయింది. అయినప్పటికీ కూడా ఈ మహమ్మారి భారీ నుండి మనం ఇంకా పూర్తిగా బయటపడలేదు. అయితే, ఈ మహమ్మారి పెద్దగా ప్రభావం చూపని ప్రాంతాలలో ఆంక్షలతో కూడిన మినహాయింపులు ప్రభుత్వం ఇస్తూ వస్తుంది. ఈ తరుణంలోనే త్వరలోనే తిరుమల దర్శనాలకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది అనే సమాచారం తో టీటీడీ భక్తులకి ఎలా దర్శనం చేయించాలి అని ఆలోచించి , పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తుంది.

క్యూలైన్లలో కలిసి మెలిసి నడవడం.. బంగారు వాకిలి ముందు ఒకింత తోపులాటల మధ్య లోపలికి ప్రవేశించడం, దర్శనం ముగిశాక బయటికి వచ్చేటప్పుడు మహాద్వారం కంటే ముందు మరోసారి ఎంతో కొంత స్థాయిలో గుమికూడటం, ఇదీ తిరుమలలో సర్వసాధారణంగా ఉండే పరిస్థితి. అయితే, ఈ మహమ్మారి ప్రభావంతో ఇకపై తిరుమలలో అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. భక్తులు భౌతిక దూరం పాటిస్తూ, సాఫీగా, ప్రశాంతంగా శ్రీవారి దర్శనం చేసుకునే పరిస్థితి వచ్చే అవకాశముంది. అంతేకాదు, ఎప్పుడు పడితే అప్పుడు తిరుమలకు వెళ్లి దర్శనం చేసుకోవడమూ కుదరకపోవచ్చు. అంతా ఒక పద్దతి ప్రకారం జరిగేలా టీటీడీ వ్యూహం సిద్ధం చేస్తుంది.

మొన్నటివరకు తిరుమలలో రోజుకు 60 వేల నుంచి 80 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుంటారు. వారాంతాల్లో, సెలవు రోజుల్లో, ప్రత్యేక దినాల్లో ఈ సంఖ్య లక్ష దాటుతుంది. అయితే , తిరిగి శ్రీవారి దర్శనం ప్రారంభమైన తర్వాత రోజుకి కేవలం 10 వేలమంది భక్తులకి మాత్రమే అవకాశం ఇవ్వనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లని టీటీడీ ఇప్పటికే సిద్ధం చేసింది. తిరుమలలో భక్తులకు మధ్య సామాజిక దూరం పాటించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. క్యూలైన్ లో , అలాగే లడ్డు కౌంటర్ల వద్ద కూడా భౌతిక దూరం పాటించేలా రెడ్ మార్కులు వేశారు. అలాగే మొదటగా టీటీడీ సిబ్బందికి దర్శనానికి అనుమతించి భౌతిక దూరం ద్వారా దర్శనం చేయించి ఏమైనా సమస్యలు వస్తాయా ..? వస్తే వారిని తీర్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ తరువాత మెల్లిమెల్లిగా మిగిలిన భక్తులని దర్శనానికి అనుమతి ఇవ్వాలని చూస్తున్నారు. అయితే , ఆరోగ్య భాగా లేకపోతే దర్శనానికి అనుమతించే ప్రసక్తే లేదు అని తెలుస్తుంది. ఇకపోతే తిరుమలలో ఒక నెల హుండీ ఆదాయం సుమారుగా 200 కోట్లు ఉంటుంది. అయితే గత రెండు నెలలుగా ఆలయం మూసేయడంతో అదంతా నష్టమే అని ...అయినప్పటికీ ఒక్కసారి ఆలయం తెరచిన తరువాత తిరుమలలో అన్ని పరిస్థితులు చక్కబడతాయి అని టీటీడీ ఛైర్మెన్ సుబ్బారెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.