Begin typing your search above and press return to search.
ప్రైవేట్ కోసం స్పీడ్ పెంచిన రైళ్లు .. ఆ రోజు ఆలా ఎందుకు చెప్పారు !
By: Tupaki Desk | 14 Dec 2020 12:36 PM ISTకేంద్రం ప్రైవేట్ రైళ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ రైళ్ల కోసం వేగాన్ని భారీగా పెంచడానికి సిద్ధమైంది. దేశంలోని రెండో అతిపెద్ద విజయవాడ రైల్వే జంక్షన్ కు సంబంధించిన మెయిన్ లైన్ పై మొదటి నుంచి రైల్వే బోర్డు ఆపాదించిన అంశాలను ప్రస్తుతం సవరించుకోవాల్సి వస్తోంది. దీని కోసం ఇప్పటికీ సాయిల్ బాగా లేదన్న తన వాదనను సమర్థించుకోవటానికి, మరోవైపు ప్రైవేటు రైళ్ల వేగాన్ని పెంచటం కోసం సగటు 130 కిలోమీటర్ల వేగ పరిమితిని నిర్ణయించింది. ఇది కూడా ప్రైవేట్ రైళ్ల కోసమే అయితే .. ఇంతకంటే వేగంగా రైళ్లు నడవబోతున్నాయి అని కొందరు చర్చించుకుంటున్నారు. విజయవాడ డివిజన్ పరిధిలో ప్రైవేటు రైళ్లను జెట్ స్పీడ్ తో నడపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రైల్వే బోర్డు.
తాజాగా ప్రైవేటు రైళ్ల ప్రతిపాదనల నేపథ్యంలో ఎంచుకున్న రూట్లలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించటానికి వీలుగా ట్రయల్స్ కూడా నిర్వహించారు. ఈ ట్రయల్స్ సాధారణ రైళ్ల కోసం అయితే ప్రయాణ సమయం తగ్గుతుందని భావించవచ్చు. ఈ ప్రయోగం కూడా ప్రైవేటు కోసమేనని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రూట్లలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రైవేటు రైళ్లను నడిపించాలన్నది రైల్వే ప్రణాళిక. ఈ వేగ పరిమితి కూడా ప్రైవేటు రైళ్లు నడిచే రూట్లకేనని సమాచారం. ప్రైవేటు రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంటే... రైల్వే శాఖ తన రైళ్లను గంటకు 100, 110 కిలోమీటర్ల వేగంతో నడుపుతుంది.
ఇప్పటికే దేశంలో పలు చోట్ల అనుమతులు పొందిన ప్రైవేటు రైళ్లు తేజస్ లకు సాధారణ రైళ్లకంటే ముందుగా చేరుకోవటానికి వీలుగా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ విభాగం సహాయ సహకారాలను అందిస్తోంది. తేజస్ రైలు కోసం ట్రాక్ ను క్లియర్ చేసి ఉంచుతున్నారు. ఇదే పంథాలో ప్రస్తుత ప్రైవేటు రైళ్లకు కూడా ట్రాక్ ను క్లియర్ చేసి ఉంచటంతో పాటు... ఆ రైలు జెట్ వేగంతో దూసుకుపోయేందుకు అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. మనకు సంబంధించిన క్లస్టర్-9లో నడిపించాలని భావిస్తున్న ప్రైవేటు రైళ్లకు తొమ్మిది సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణను తెలిపారు. క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ర్ఫాస్ట్రక్చర్, గేట్వే రైల్ ప్రైవేట్ లిమిటెడ్, గేట్ వే డిస్ర్టి పార్క్స్ లిమిటెడ్, ఐఆర్ సీటీసీ, ఐఆర్ బీ ఇన్ ఫ్రా అండ్ డెవలపర్స్, ఎల్ అండ్ టీ, మాలెంపాటి పవర్, టెక్నో ఇన్ ఫ్రా డెవలపర్స్, మేఘా ఇంజనీరింగ్, వెల్స్పన్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ లతో పేరు వెల్లడించని మరో రెండు కన్సార్టియాలు దరఖాస్తులను సమర్పించటంతో పాటు అర్హతను కూడా సాధించాయి.
విజయవాడ డివిజన్ పరిధిలోని రెండు రూట్లలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు దూసుకుపోయేలా ఇటీవలే రైల్వే అధికారులు ట్రయల్స్ నిర్వహించారు. విజయవాడ - విశాఖపట్నం, విజయవాడ - చెన్నై మార్గాల్లో ఒక ఇంజన్కు రెండు బోగీలను తగిలించి ప్రయాణికులు లేకుండా ట్రయల్స్ను నిర్వహించారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ట్రాక్ను పరీక్షించారు. ఇబ్బందులను, ట్రాక్ను బలోపేతం చేయాల్సిన ప్రాంతాలను గుర్తించారు. అయితే ఈ వేగాన్ని కేవలం ప్రైవేట్ రైళ్లకే పరిమితం చేయడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తాజాగా ప్రైవేటు రైళ్ల ప్రతిపాదనల నేపథ్యంలో ఎంచుకున్న రూట్లలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించటానికి వీలుగా ట్రయల్స్ కూడా నిర్వహించారు. ఈ ట్రయల్స్ సాధారణ రైళ్ల కోసం అయితే ప్రయాణ సమయం తగ్గుతుందని భావించవచ్చు. ఈ ప్రయోగం కూడా ప్రైవేటు కోసమేనని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన రూట్లలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రైవేటు రైళ్లను నడిపించాలన్నది రైల్వే ప్రణాళిక. ఈ వేగ పరిమితి కూడా ప్రైవేటు రైళ్లు నడిచే రూట్లకేనని సమాచారం. ప్రైవేటు రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంటే... రైల్వే శాఖ తన రైళ్లను గంటకు 100, 110 కిలోమీటర్ల వేగంతో నడుపుతుంది.
ఇప్పటికే దేశంలో పలు చోట్ల అనుమతులు పొందిన ప్రైవేటు రైళ్లు తేజస్ లకు సాధారణ రైళ్లకంటే ముందుగా చేరుకోవటానికి వీలుగా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ విభాగం సహాయ సహకారాలను అందిస్తోంది. తేజస్ రైలు కోసం ట్రాక్ ను క్లియర్ చేసి ఉంచుతున్నారు. ఇదే పంథాలో ప్రస్తుత ప్రైవేటు రైళ్లకు కూడా ట్రాక్ ను క్లియర్ చేసి ఉంచటంతో పాటు... ఆ రైలు జెట్ వేగంతో దూసుకుపోయేందుకు అవసరమైన సహకారాన్ని అందించనున్నారు. మనకు సంబంధించిన క్లస్టర్-9లో నడిపించాలని భావిస్తున్న ప్రైవేటు రైళ్లకు తొమ్మిది సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణను తెలిపారు. క్యూబ్ హైవేస్ అండ్ ఇన్ర్ఫాస్ట్రక్చర్, గేట్వే రైల్ ప్రైవేట్ లిమిటెడ్, గేట్ వే డిస్ర్టి పార్క్స్ లిమిటెడ్, ఐఆర్ సీటీసీ, ఐఆర్ బీ ఇన్ ఫ్రా అండ్ డెవలపర్స్, ఎల్ అండ్ టీ, మాలెంపాటి పవర్, టెక్నో ఇన్ ఫ్రా డెవలపర్స్, మేఘా ఇంజనీరింగ్, వెల్స్పన్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ లతో పేరు వెల్లడించని మరో రెండు కన్సార్టియాలు దరఖాస్తులను సమర్పించటంతో పాటు అర్హతను కూడా సాధించాయి.
విజయవాడ డివిజన్ పరిధిలోని రెండు రూట్లలో గంటకు 130 కిలోమీటర్ల వేగంతో రైళ్లు దూసుకుపోయేలా ఇటీవలే రైల్వే అధికారులు ట్రయల్స్ నిర్వహించారు. విజయవాడ - విశాఖపట్నం, విజయవాడ - చెన్నై మార్గాల్లో ఒక ఇంజన్కు రెండు బోగీలను తగిలించి ప్రయాణికులు లేకుండా ట్రయల్స్ను నిర్వహించారు. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ట్రాక్ను పరీక్షించారు. ఇబ్బందులను, ట్రాక్ను బలోపేతం చేయాల్సిన ప్రాంతాలను గుర్తించారు. అయితే ఈ వేగాన్ని కేవలం ప్రైవేట్ రైళ్లకే పరిమితం చేయడం పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
