Begin typing your search above and press return to search.

నంద్యాల లో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి

By:  Tupaki Desk   |   28 April 2021 11:30 AM GMT
నంద్యాల లో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
X
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి ఆత్మహత్య కి పాల్పడ్డారు. కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన ఈ దారుణమైన ఘటనలు నలుగురు కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. నంద్యాల మాల్దార్‌పేటలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కుమార్తెలతో పాటు దంపతులు పురుగులమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళ్తే ..నంద్యాల నడిగడ్డ సమీపంలోని మల్దార్‌ పేట లో ఓ కుటుంబం ఇద్దరు పిల్లలతోపాటు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులు పిల్లలతో పాటుగా పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన జరిగిన ప్రదేశానికి చేరుకొని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే నలుగురు ప్రాణాలు తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతి చెందిన వారు శేఖర్‌, కళావతి, అంజలి, అఖిల గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ ఘటనపై ఆరా తీస్తున్నారు. బంధువులని ప్రశ్నిస్తున్నారు. ఆర్థిక సమస్యలతోనే ప్రాణాలు తీసుకున్నారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.