Begin typing your search above and press return to search.
ఏపీలో ఓటర్లు తేలారు...ఫలితమే పెండింగ్
By: Tupaki Desk | 13 Jan 2019 5:09 AM GMTఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఓటర్లు ఎందరో తేలిపోయింది. వర్గాల వారీగా..... జెండర్ అనుసరించి ఓటర్ల జాబితాకు తుది రూపం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ లో 3,69,33,091 మంది ఓటర్లు ఉన్నట్లుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. సమైఖ్య రాష్ట్రంలో ఆరు కోట్ల ఆంధ్రులు అని ప్రతి ఒక్కరూ పిలుచుకున్నది ఈ జాబితాతో నిజమే అయ్యింది. రాష్ట్రం విడిపోయాక ఆరు కోట్లలో సగం మంది అంటే మూడు కోట్ల కంటే ఎక్కువ మందే ఆంధ్రప్రదేశ్ లో ఓటర్లుగా నమోదయ్యారు. అది కూడా దగ్గర దగ్గర నాలుగు కోట్లకు చేరుకుంది. ఈ నాలుగు కోట్ల మంది ఓటర్ల లెక్క తేలింది. ఇక తేలాల్సింది 2019 శాసనసభ ఎన్నికల్లో విజయం ఎవరిదో అనేదే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓటర్లలో పురుషులు 1,83,24, 588 మంది ఉన్నారు. ఇక మహిళా ఓటర్లు 1, 86,04,742 మంది ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ కు చెందిన వారు 3,761 మంది ఓటర్లు ఉన్నారు. ఈ లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం విశేషం. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 40,13,770 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్ప ఓటర్ల ఉన్న జిల్లాగా విజయనగరం జిల్లా ఉంది. ఇక్కడ 17,33,667 మంది ఓటర్లు ఉన్నారు.
ప్రతి జిల్లాలోనూ సగటున 20 లక్షలకు మించి ఓటర్లు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 20,64,330 మంది. విశాఖపట్నం జిల్లాలో 32,80,028 - పశ్చిమ గోదావరి జిల్లాలో 30,57,922 - క్రిష్ణ జిల్లాలో 33,03,592 మంది ఓటర్లు ఉన్నారు. ఇక గుంటూరు జిల్లాలో 37,46,072 మంది ఓటర్లు - ప్రకాశం జిల్లాలో 24,95,383 మంది - నెల్లూరు జిల్లాలో 22,06,652 మంది ఓటర్లు ఉన్నారు. ఇక రాజకీయాలకు ఆలవాలమైన రాయలసీమ జిల్లాలో కూడా ఓటర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో 20,56,660 మంది ఓటర్లు - కర్నూలు జిల్లాలో 28,90,884 మంది ఓటర్లు - అనంతపురంలో 30,58,909 మంది - చిత్తూరు జిల్లాలో 30,25,222 మంది ఓటర్లు నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో వారి ఓట్లు ప్రతిపక్ష పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య తేలింది. ఇక తేలాల్సింది ఎన్నికల్లో ఫలితమే అని అంటున్నారు.
ప్రతి జిల్లాలోనూ సగటున 20 లక్షలకు మించి ఓటర్లు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 20,64,330 మంది. విశాఖపట్నం జిల్లాలో 32,80,028 - పశ్చిమ గోదావరి జిల్లాలో 30,57,922 - క్రిష్ణ జిల్లాలో 33,03,592 మంది ఓటర్లు ఉన్నారు. ఇక గుంటూరు జిల్లాలో 37,46,072 మంది ఓటర్లు - ప్రకాశం జిల్లాలో 24,95,383 మంది - నెల్లూరు జిల్లాలో 22,06,652 మంది ఓటర్లు ఉన్నారు. ఇక రాజకీయాలకు ఆలవాలమైన రాయలసీమ జిల్లాలో కూడా ఓటర్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రతిపక్ష నాయకుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపలో 20,56,660 మంది ఓటర్లు - కర్నూలు జిల్లాలో 28,90,884 మంది ఓటర్లు - అనంతపురంలో 30,58,909 మంది - చిత్తూరు జిల్లాలో 30,25,222 మంది ఓటర్లు నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. దీంతో వారి ఓట్లు ప్రతిపక్ష పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య తేలింది. ఇక తేలాల్సింది ఎన్నికల్లో ఫలితమే అని అంటున్నారు.