Begin typing your search above and press return to search.

విశాఖలో ఇప్పటివరకు జరిగిన పారిశ్రామిక ప్రమాదాలు !

By:  Tupaki Desk   |   1 July 2020 5:00 AM IST
విశాఖలో ఇప్పటివరకు జరిగిన పారిశ్రామిక ప్రమాదాలు !
X
విశాఖపట్నం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మహానగరం. అన్ని కుదిరితే కాబోయే ఏపీ రాజధాని కూడా. అలాగే అత్యంత సర్వాంగసుందరమైన నగరం. ఆహ్లదకరమైన వాతావరణానికి నిలయం. అయితే , పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన విశాఖ నగరంలో ఇటీవల కాలంలో పారిశ్రామిక ప్రమాదాలు కార్మికులను బలిగొంటున్నాయి. ఒక్కోసారి సాధారణ ప్రజలూ ఈ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.ప్రధానంగా ఔషధ, రసాయన, ఉక్కు, జౌళి పరిశ్రమలకు కేంద్రమైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏటా పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. విశాఖ జిల్లా లోని ఇండస్ట్రియల్ ఏరియాల్లోని వివిధ కర్మాగారాల్లో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.

విశాఖపట్నంలో ఇప్పటివరకు జరిగిన పారిశ్రామిక ప్రమాదాలని ఒకసారి చూస్తే ..

గో క్లెమ్ ఇండస్ట్రీస్.. నలుగురు మృతి.. 30- 5 -2013
గో క్లెమ్ ఇండస్ట్రీస్.. ఇద్దరు మృతి.. 28- 6- 2014
అజికో బయో ఫోర్.. ఐదుగురు మృతి.. 2- 5 -2017
లేబొరేటరీస్.. ఇద్దరు మృతి.. 27- 12- 2019
ఎల్జి పాలిమర్స్ ...15 మంది మృతి.. 7- 5- 2020
సాయినార్ లైఫ్ సైన్సెస్.. ఇద్దరు మృతి..30-06-2020