Begin typing your search above and press return to search.

ప్రముఖుల అడ్డాలో చోరీలు

By:  Tupaki Desk   |   17 March 2015 4:50 AM GMT
ప్రముఖుల అడ్డాలో చోరీలు
X
హైదరాబాద్‌ మహానగరంలో ప్రముఖులు బెదిరిపోయే పరిస్థితి. అత్యంత సంపన్నులు ఉండే జూబ్లీహిల్స్‌ పరిధిలో ప్రముఖల ఇళ్లల్లోకి జరపడి దొంగతనాలు చేయటం ఈ మధ్య ఎక్కువైంది.

ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న ఘటనలతో ప్రముఖుల అడ్డాలో కలకలం రేపుతోంది. గత గురువారం రామానాయుడు స్టూడియోలోకి చొరబడిన దొంగలు స్వైరవిహారం చేయటం తెలిసిందే. ఈ ఘటనలో లక్షలాది రూపాయిలు విలువ చేసే ఎల్‌ఈడీ లైట్లను చోరీ చేశారు.

ఈ ఘటన జరిగిన వెంటనే.. ప్రముఖ దర్శకులు పూరీజగన్నాధ్‌ ఇంట్లో దొంగతనం జరిగి రూ.20లక్షలు విలువ చేసే బంగారు నగలు పోయాయి. తాజాగా సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని బిజినెస్‌మేన్‌ సుధీర్‌ ఇంట్లో చోరీ జరిగింది.

ఈ దొంగతనంలో రెండు కిలోల బంగారాన్ని దొంగలు దోచుకెళ్లారు. సుధీర్‌ పిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. దొంగల్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు షురూ చేవారు. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న దొంగతనాలు ప్రముఖలకు సరికొత్త భయాన్ని తెస్తున్నాయి.