Begin typing your search above and press return to search.

ఫ్రెండ్ తో బీచ్ కి వెళ్లిన యువతి..కానీ, అలా జరుగుతుంది అని ఊహించలేకపోయింది !

By:  Tupaki Desk   |   14 May 2021 12:30 AM GMT
ఫ్రెండ్ తో బీచ్ కి వెళ్లిన యువతి..కానీ, అలా జరుగుతుంది అని ఊహించలేకపోయింది !
X
ఒక పక్క కరోనా వైరస్ ప్రపంచం మొత్తం విలవిలలాడిపోతుంటే .. మరో పక్క ఇలాంటి విపత్కర సమయంలోను మృగాళ్లు, మహిళలను వదలడం లేదు. వేధింపులకు గురిచేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఒక యువతిపై ముగ్గురు యువకులు సాముహిక అత్యాచారం చేసి, ఆమె నగ్న ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటన తూర్పు గోదావరి జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఆ యువతి ఫ్రెండ్ తో కలిసి సరదాగా గడుపుదామని బీచ్ కు వెళ్లింది. సముద్రపు కెరటాలు, చల్లనిగాని ఆస్వాదిస్తోంది. కానీ అంతలోనే ముగ్గురు మృగాళ్లు ఎంట్రీ ఇచ్చారు. మద్యంమత్తులో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా ఆ ఘోరాన్ని వీడియోతీసి ఆమెను బ్లాక్ మెయిలింగ్ చేస్తూ వచ్చారు. ఇక ఆ వేధింపులు భరించలేని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు తెలిపిన కథనాల ప్రకారం.. ఉప్పలగుప్తం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి ,బంధువుల ఇంటి వద్ద పెళ్లి ఉండడంతో 15 రోజుల క్రితం అల్లవరం వచ్చింది. అక్కడ పెళ్లికి ఇంకా టైమ్ ఉండడంతో స్నేహితుడితో కలిసి కొమరగిరిపట్నం కడదరి ప్రాంతంలో సముద్రం చూడడానికి వెళ్ళింది. అక్కడ ముగ్గురు యువకులు మద్యం మత్తులో యువతి స్నేహితుడిపై దాడి చేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అంతేకాకుండా ఆమె నగ్న ఫోటోలను తీసి ఎవరికైనా చెప్తే ఈ ఫోటోలను సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తామని బెదిరించారు. పరువు పోతుందని భావించిన యువతి ఎవరికి చెప్పకుండా ఇంట్లోనే ఉండిపోయింది. దీంతో మరోసారి కీచకులు రెచ్చిపోయారు. మరోసారి తమ కోరిక తీర్చాలని యువతికి ఫోన్ చేసి బెదిరించారు. ఇక వారి వేధింపులు తాళలేని యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు యువకుల కోసం వెదుకుతున్నారు.