Begin typing your search above and press return to search.

పిల్లలు పుట్టాలని ఆ ఊర్లో పూజారులతో ... ఏంచేస్తారంటే ?

By:  Tupaki Desk   |   24 Nov 2020 11:30 PM GMT
పిల్లలు పుట్టాలని ఆ ఊర్లో పూజారులతో ... ఏంచేస్తారంటే ?
X
పెళ్లి తో మొదలయ్యే కొత్త జీవితం పిల్లలతో పరిపూర్ణం అవుతుంది. పిల్లలు లేని వారి జీవితం ఎందుకు పనికిరాదు అని అనుకుంటారు. అందుకే పిల్లలు లేని వారు ఎంతోమంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. అలాగే కనిపించిన ప్రతి స్వామి కాళ్లు మొక్కుతారు , ప్రతి దేవుడిని నోములు నొస్తారు. కొంతమంది పిల్లల కోసం మూఢనమ్మకాలు నమ్మి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు. ఆధునిక యుగం లో మంత్రాలకు పిల్లలు పుడతారు అని చెప్తే నమ్మేవారు ఇంకా ఉన్నారు అంటే నిజంగా వారికంటే అమాయకులు ఇంకెవరు ఉండరు.

ప్రస్తుత రోజుల్లో కూడా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయన్న దానికి ఇదో పెద్ద ఉదాహరణ. ఛత్తీస్ ‌గఢ్ రాష్ట్రంలోని ధమ్తారి జిల్లాలో ఓ ద్రిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. పూజారులతో తొక్కించుకుంటే పిల్లలు పుడతారనే నమ్మకంతో వందల మంది మహిళలు బోర్లా పడుకుని పూజారులు, మంత్రగాళ్లతో తొక్కించుకున్నారు. సంతాన లేక , బాధపడుతున్న దాదాపు 200 మంది మహిళలను ఆశీర్వదించడానికి పూజారులు వారిపై నడుచుకుంటూ వెళ్లారు. ధమ్తారీ జిల్లాలోని అంగామోతి మాత దేవాలయం దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ప్రతి ఏడాది జరిగే జాతరకు వేల మంది తరలివస్తారు. ఈ ఏడాది కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ సామాజిక దూరం, మాస్కులు ధరించడం వంటి నిబంధనలు ఉన్నా సరే వేల సంఖ్య లో భక్తులు తరలివచ్చారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో అక్కడ ప్రజల మూఢనమ్మకంపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. ఇది సాధారణంగా ప్రతి ఏడాది దీపావళి తరువాత వచ్చే మొదటి శుక్రవారం జరుగుతుంది. అక్కడ ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు తరలివచ్చి అంగార్మోటి దేవిని ప్రార్థిస్తారు. ఈ ఘటనపై అక్కడి స్థానిక అధికారులు స్పందిస్తూ ‘‘ఈ మూఢనమ్మకం 500 సంవత్సరాలుగా కొనసాగుతోంది. స్థానికులు తమ సంప్రదాయంలో భాగంగా ఈ మూఢనమ్మకాన్ని గట్టిగా నమ్ముతున్నారు. దీనిలో పాల్గొన్న తర్వాత చాలా మంది మహిళలు గర్భం దాల్చినట్లు స్థానికులు చెబుతున్నారు అని అంటున్నారు. వైరల్ అయిన వీడియోలో, సుమారు 200 మంది మహిళలు నేల మీద పడుకోగా పూజారులు మంత్రాలు జపిస్తూ, బ్యానర్లు పట్టుకుంటూ వారి వీపుపై నడుస్తూ కనిపించారు.