Begin typing your search above and press return to search.

భర్త మర్మాంగంపై వేడినీళ్లు పోసిన భార్య.. షాకింగ్ కారణం ఇదీ

By:  Tupaki Desk   |   18 Aug 2022 2:30 AM GMT
భర్త మర్మాంగంపై వేడినీళ్లు పోసిన భార్య.. షాకింగ్ కారణం ఇదీ
X
భార్యా భర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు రావడం సహజం.. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినప్పుడు తిట్టుకోవడం సాధారణం. కొన్ని సార్లు ఇద్దరూ కొట్టుకుంటారు కూడా. అలాంటి ఘటనలు మన చుట్టూ చాలానే చోటుచేసుకుంటాయి. కొందరు ఈ భార్య భర్తల గొడవలను తెగ ఎంజాయ్ చేస్తారు. ఇంకొందరు సీరియస్ తీసుకొని సర్దుబాటు చేసుకుంటారు. మరికొందరు విడిపోతారు. కానీ ఓ భార్య మాత్రం భర్తపై కోపంతో రగిలిపోయింది.

అతడు గాఢనిద్రలో ఉండగా అతడి మర్మాంగంపై వేడినీళ్లు బాగా కాచి పోసింది. 40 శాతం శరీరం కాలడంతో ఇప్పుడు అతడు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. భర్తను ఆస్పత్రికి తీసుకెళ్లి మరీ పోలీసులకు లొంగిపోయింది ఈ సతీసావిత్రి. ఇంతకీ ఆమె ఎందుకు అలా చేసిందని ఆరాతీస్తే షాకింగ్ కారణం బయటపడింది.

తమిళనాడు కావేరిపాక్కానికి చెందిన తంగరాజ్, ప్రియకు వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. కొన్నేళ్లుగా అతడు భార్యను అనుమానిస్తూ వేధిస్తున్నాడు. ఈ క్రమంలోనే తంగరాజ్ వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియ కోపంతో రగిలిపోయింది. తనను కాదని వేరొక ఆమె వద్దకు వెళుతున్న భర్తకు బుద్ది చెప్పాలని డిసైడ్ అయ్యింది.

భర్త గాఢనిద్రలోకి జారుకున్నాక అతడి మర్మాంగంపై వేడి నీళ్లు పోసింది. బాధతో విలవిలలాడుతున్న భర్తను ఆమెనే ఆస్పత్రికి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. తంగరాజ్ శరీరం 40శాతం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్త మార్మాంగాన్నే టార్గెట్ చేసిన భార్య చేసిన పని వైరల్ అయ్యింది. మగాడికి బుద్ది వస్తుందని చేసినా..ఇప్పుడు అతడి ప్రాణాలకే ముప్పు అయ్యింది. ఆడది తెగిస్తే ఎంత డేంజర్ అన్నది ఈ ఘటనతో పురుష పుంగవులకు అర్థమైనట్టు ఉంది.

ఇటువంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లోనూ చోటుచేసుకున్నాయి. చాలా చోట్ల భార్యలు ఇలా భర్తలపై వేడినీళ్లు పోసిన దాఖలాలలున్నాయి.