Begin typing your search above and press return to search.
రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
By: Tupaki Desk | 20 Dec 2020 9:15 AM ISTహైకోర్టులో కేసీఆర్ సర్కార్ కు మరోసారి ఎదురుదెబ్బ తగలడం.. తన మానసపత్రిక ‘ధరణి’ వెబ్ సైట్ భూ రిజిస్ట్రేషన్లపై వెనక్కి తగ్గాల్సిన పరిస్తితులు ఏర్పడ్డాయి. దీంతో తాజాగా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దాదాపు నెలన్నరగా తెలంగాణలో భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పాత పద్ధతిలోనే ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ముందస్తు స్లాట్ బుకింగ్ లు కూడా రద్దు చేస్తున్నట్టు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకొని ఉంటే వారికి కేటాయించిన తేదీల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు.
హైకోర్టు ఆదేశాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తెలంగాణ సర్కార్ మార్పులు చేసింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ధరణిపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతుండటం.. దీంతో స్లాట్స్ బుకింగ్ కూడా నిలిపివేయమని ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే హైకోర్టు ఉత్తర్వులపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆదివారం దీనిపై అధికారికంగా సమావేశమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను చేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు.
స్లాట్ బుకింగ్ అవసరం లేకుండా.. ఆధార్ వివరాలతో నిమిత్తం లేకుండా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సోమవారం నుంచి తెలంగాణలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
దాదాపు నెలన్నరగా తెలంగాణలో భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే పాత పద్ధతిలోనే ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. ముందస్తు స్లాట్ బుకింగ్ లు కూడా రద్దు చేస్తున్నట్టు సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకొని ఉంటే వారికి కేటాయించిన తేదీల్లోనే రిజిస్ట్రేషన్ చేస్తారు.
హైకోర్టు ఆదేశాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియలో తెలంగాణ సర్కార్ మార్పులు చేసింది. ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ధరణిపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాలు తెలుపుతుండటం.. దీంతో స్లాట్స్ బుకింగ్ కూడా నిలిపివేయమని ఆదేశించడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే హైకోర్టు ఉత్తర్వులపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆదివారం దీనిపై అధికారికంగా సమావేశమై నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ రోజు నుంచి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లను చేసేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ఉత్తర్వులు జారీ చేశారు.
స్లాట్ బుకింగ్ అవసరం లేకుండా.. ఆధార్ వివరాలతో నిమిత్తం లేకుండా హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సోమవారం నుంచి తెలంగాణలో వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలోనే ప్రారంభించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
