Begin typing your search above and press return to search.

పౌరసత్వ సవరణ చట్టం పై కేంద్రం కీలక నిర్ణయం

By:  Tupaki Desk   |   24 Dec 2019 11:11 AM GMT
పౌరసత్వ సవరణ చట్టం పై కేంద్రం కీలక నిర్ణయం
X
దేశ వ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం పై వ్యతిరేకత.. ఆందోళనలు చెలరేగుతున్న వేళ కేంద్రంలోని బీజేపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జార్ఖండ్ లో ఓడిపోవడం.. మహారాష్ట్ర లో మిత్రులు దూరమైన నేపథ్యం లో బీజేపీ వెనక్కి తగ్గింది.

పౌరసత్వ సవరణ చట్టం పై బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తాజాగా ప్రత్యేకమైన ‘ఈమెయిల్’ రూపొందించింది. ప్రజలతో పాటు ఎంపీలు, ప్రముఖుల నుంచి అభిప్రాయాలు సేకరించడానికి నిర్ణయించింది.

తాజాగా హోంశాఖ పౌరసత్వ సవరణ చట్టం పై అభ్యంతరాలను స్వీకరించడానికి రెడీ అయ్యింది. జాతీయ పౌరసత్వంపై మీ అభిప్రాయం.. మైనార్టీల కు న్యాయం జరుగుతుందా? నిరసనలు, హింసాత్మక ఘటనలపై మీ అభిప్రాయం.. దేశానికి ఈ చట్టం నష్టం కలిగిస్తుందని అనుకుంటున్నారా తదితర ప్రశ్నలను పొందుపరిచింది. వీటిపై ఈ మెయిల్ చేయాలని సూచించింది. దీన్ని బట్టి కేంద్రం పౌరసత్వ సవరణ చట్టం పై వెనక్కి తగ్గినట్టే కనిపిస్తోంది.