Begin typing your search above and press return to search.

ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   7 Feb 2021 12:15 PM IST
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం
X
పంచాయతీ ఎన్నికల వేళ ఏపీ సర్కార్ మరో సంచలనం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నోటిఫికేషన్ ముగిసే వరకు స్పెసల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదా ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

జోనల్, ఫ్లయింగ్ స్క్వాడ్ , స్టాటిక్ సర్వీలెన్స్ బృందాల చీఫ్ లకు అధికారాలు కూడా ఇస్తున్నట్టు పేర్కొన్నారు. నిమ్మగడ్డ నిర్ణయాలను సమీక్షించి ప్రభుత్వం మాట నెగ్గించుకునేందుకే ఈ అధికారాలు కట్టబెట్టినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. తద్వారా ప్రభుత్వం నియంత్రణలోనే ఎన్నికలు జరిగేలా స్కెచ్ గీసినట్టు ప్రచారం జరుగుతోంది.

అలాగే కృష్ణా , నెల్లూరు, కర్నూలు, విజయనగరం అనంతపురం, విశాఖ జిల్లా ఎన్నికల అధికారులుగా కలెక్టర్లు నోటిఫై చేసిన వారికి మెజిస్టీరియల్ అధికారాలు కల్పించారు.

ఎన్నికల నోటిఫికేషన్ ముగిసేంతవరకు వీరిని స్పెసల్ ఎగ్జిక్యూటివివ్ మెజిస్ట్రేట్లుగా గుర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరోపక్క మంత్రి పెద్దిరెడ్డి మీద ఎస్ఈసీ ఆదేశాలు సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ దాఖలు చేసింది. ఈనెల 21 వరకు పెద్దిరెడ్డిని ఇంటి నుంచి బయటకు రాకుండా చూడాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు.