Begin typing your search above and press return to search.

తెలుగు విద్యార్తిని చేపలు తినేశాయి..

By:  Tupaki Desk   |   29 July 2019 8:53 AM GMT
తెలుగు విద్యార్తిని చేపలు తినేశాయి..
X
భారతీయులు విదేశాల్లో చదువుల మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దేశం కానీ దేశంలో ప్రమాదాల్లో విగతజీవులుగా మారిపోతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా వాసి వడల వివేక్ (19) లాత్వియా దేశంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

పాలకొల్లు మండలం గోరింటాడకు చెందిన వడల శ్యాంబాబు- స్వర్ణలత దంపతుల పెద్ద కుమారుడు వివేక్ ఆరు నెలల క్రితం లాత్వియాలోని రిగా నగరానికి వెళ్లారు. అక్కడి రిగా యూనివర్సిటీలో బీఎస్సీ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకున్నాడు. తోటి విద్యార్థి పుట్టినరోజు వేడులకు నగరం పక్కన ఉన్న నదీతీరానికి వెళ్లాడు. అయితే నది ఉధృతి పెరిగి ఒడ్డున ఉన్న వివేక్ నది ప్రవాహంలో కొట్టుకుపోయాడు. గమనించిన తోటి స్నేహితులు వివేక్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

కాగా పోలీసులు వివేక్ డెడ్ బాడీ కోసం గాలించి వెలికితీశారు. అప్పటికే మృతదేహాన్ని చేపలు తినేశాయని పోలీసులు తెలిపారు. అయితే వివేక్ బంధువులు మాత్రం దీనిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా వివేక్ తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా కువైట్ లో ఉంటున్నారు.