Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రికి కరోనా.. అపెక్స్ కౌన్సిల్ భేటి వాయిదా

By:  Tupaki Desk   |   23 Aug 2020 8:51 AM GMT
కేంద్రమంత్రికి కరోనా.. అపెక్స్ కౌన్సిల్ భేటి వాయిదా
X
తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షేకావత్ అధ్యక్షతన ఈనెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది. కేంద్రమంత్రి షేకావత్ కు కరోనా సోకడంతో ఈ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశం ఇలా వాయిదాపడడం ఇది రెండోసారి..

మొదటగా ఈనెల 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఆ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన కారణంగా ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ కోరారు. దీంతో ఈనెల 25న కొత్త తేదిని ఖాయం చేశారు.

ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ సమాయత్తమవుతున్న వేళ.. కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షేకావత్ కు ఈనెల 20వ తేదీన కరోనా సోకింది. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరాడు. దీంతో సమావేశాన్ని మరోసారి వాయిదా వేస్తున్నట్లు కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ రెండురాష్ట్రాలకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చింది.

కేంద్రమంత్రి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మరోసారి భేటి జరిగే అవకాశం కనిపిస్తోంది.