Begin typing your search above and press return to search.

ఒలింపిక్స్ కి టీం ఇండియా .. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్

By:  Tupaki Desk   |   17 April 2021 11:30 PM GMT
ఒలింపిక్స్ కి టీం ఇండియా .. బీసీసీఐ గ్రీన్ సిగ్నల్
X
ఒలింపిక్స్ లో క్రికెట్ ను కూడా చేర్చాలని గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతూ ఉంది. ప్రస్తుతానికి కొన్ని దేశాల్లో మాత్రమే ఫేమస్ అయిన క్రికెట్ ను ఒలింపిక్స్ లో చేరిస్తే మరింత ఆదరణ దక్కే అవకాశం కూడా ఉందని భావిస్తూ ఉన్నారు. తాజాగా ఒలింపిక్స్ విషయంలో బీసీసీఐ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒలంపిక్స్ లో క్రికెట్ ను కనుక చేర్చితే పురుషులు, మహిళల టీంలను అందులో ఆడించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సూత్రప్రాయ నిర్ణయం తెలిపింది. బోర్డు అపెక్స్ కౌన్సిల్ వర్చువల్ సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

2028లో జరిగే లాస్ ఏంజిలిస్ ఒలింపిక్స్ రోస్టర్ లో క్రికెట్ ను చేరిస్తే రెండు టీంలను పంపాలని ఆలోచిస్తుంది. వచ్చే ఏడాది బ్రిటన్ లోని బర్మింగ్ హాంలో జరగబోయే కామన్ వెల్త్ గేమ్స్ కు మహిళల టీంను పంపించేందుకు అపెక్స్ కౌన్సిల్ అంగీకారం తెలిపింది. దాంతో పాటు మహిళల టీంకు సంబంధించి షెడ్యూల్ నూ ఖరారు చేసింది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడేందుకు నిర్ణయించింది.

ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ కు సన్నాహకంగా న్యూజిల్యాండ్ తో మరో సిరీస్ ను ఆడేందుకు ఓకే చెప్పింది. ఇక, గత ఏడాది జరిగినట్టే మూడు జట్లతో మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే ఇంగ్లండ్ లో సిరీస్ ఆడనుంది. తిరిగొచ్చాక స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆడుతుంది. ఆ సిరీస్ పూర్తవ్వగానే ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో, ఆ తర్వాత న్యూజిలాండ్ తో ద్వైపాక్షిక లేదా త్రైపాక్షిక సిరీస్ ను మహిళల టీం ఆడనుంది. దాంతో పాటు పూర్తి స్థాయి డొమెస్టిక్ క్రికెట్ మ్యాచ్ లను ఆడేందుకు బీసీసీఐ క్యాలెండర్ ను సిద్ధం చేసింది. ఇక ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేరిస్తే భారత్ ఖాతాలో ఒకట్రెండు పతకాలు వచ్చే అవకాశం చాలా ఉంది. ఇక ఐసీసీ ఒలింపిక్స్ లో క్రికెట్ ను చేర్చేలా చర్యలు తీసుకుంటుందో లేదో చూడాలి.