Begin typing your search above and press return to search.
టీడీపీ జెండా పట్టుకోకపోతే సంగతి తేలుస్తారట..!
By: Tupaki Desk | 13 Feb 2019 4:35 AM GMTఅధికారం చేతిలో ఉందని అంతా నా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఏపీలోని పాలక పార్టీ నేతలు. ఇప్పటికే చింతమనేని ప్రభాకర్ వంటి నేతలు తమ దుందుడుకు వైఖరి - బెదిరింపులతో నిత్యం వార్తల్లో ఉంటుండగా తెలుగుదేశం పార్టీకే చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఇప్పుడు అదే తరహా ప్రవర్తనతో బయటపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ విప్ - శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎంఎల్ ఏ కూన రవికుమార్ ఓ వ్యక్తిని బెదరిస్తున్న ఆడియో టేప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆమదాలవలస నియోజకవర్గంలో శివ అనే ఒక కార్యకర్త టీడీపీ నుంచి వెళ్లిపోయారట. దాంతో ఆయనకు ఫోన్ చేసిన కూన ఫోన్లో నానా మాటలాడుతూ నీ సంగతేంటో చూస్తానంటూ బెదిరించారు. టీడీపీ జెండా పట్టుకుని తన కోసం పని చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేత - సినీ నటుడు బాలకృష్ణ తరహాలో చూడూ ఒకవైపే చూడు అన్నట్లుగా తన రెండో యాంగిల్ చూడాలనుకోవద్దుం అంటూ పాపం ఆ కార్యకర్తను హెచ్చరించారు.
నిజానికి ఇలాంటి బెదిరింపులు టీడీపీ నేతల నుంచి కొత్తేమీ కాదు. చంద్రబాబు నాయుడే దీనికి ఆద్యుడంటారు విమర్శకులు. ఆ తరువాత ఉత్తరాంధ్ర నాయకుల నుంచి ఇలాంటి బెదిరింపులు ఎక్కువగా ఉంటున్నాయి. అచ్చెన్నాయుడు - అయ్యన్నపాత్రుడు కూడా గతంలో ఇలా బెదిరింపులకు దిగినట్లు చెబుతున్నారు.
అందరూ అంటున్నట్లు తెలుగుదేశం నేతల్లో ఓటమి భయం మొదలవడమే ఇలాంటి ధోరణికి కారణంగా కనిపిస్తోంది. గెలుపుపై నమ్మకం ఉంటే నేతలు రెచ్చిపోరని... శ్రేణులు - ప్రజలతో సయోధ్యతో ఉంటారని.. ఓడిపోతామన్న భయం మొదలైనప్పుడే ఇలా జరుగుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
ఆమదాలవలస నియోజకవర్గంలో శివ అనే ఒక కార్యకర్త టీడీపీ నుంచి వెళ్లిపోయారట. దాంతో ఆయనకు ఫోన్ చేసిన కూన ఫోన్లో నానా మాటలాడుతూ నీ సంగతేంటో చూస్తానంటూ బెదిరించారు. టీడీపీ జెండా పట్టుకుని తన కోసం పని చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నేత - సినీ నటుడు బాలకృష్ణ తరహాలో చూడూ ఒకవైపే చూడు అన్నట్లుగా తన రెండో యాంగిల్ చూడాలనుకోవద్దుం అంటూ పాపం ఆ కార్యకర్తను హెచ్చరించారు.
నిజానికి ఇలాంటి బెదిరింపులు టీడీపీ నేతల నుంచి కొత్తేమీ కాదు. చంద్రబాబు నాయుడే దీనికి ఆద్యుడంటారు విమర్శకులు. ఆ తరువాత ఉత్తరాంధ్ర నాయకుల నుంచి ఇలాంటి బెదిరింపులు ఎక్కువగా ఉంటున్నాయి. అచ్చెన్నాయుడు - అయ్యన్నపాత్రుడు కూడా గతంలో ఇలా బెదిరింపులకు దిగినట్లు చెబుతున్నారు.
అందరూ అంటున్నట్లు తెలుగుదేశం నేతల్లో ఓటమి భయం మొదలవడమే ఇలాంటి ధోరణికి కారణంగా కనిపిస్తోంది. గెలుపుపై నమ్మకం ఉంటే నేతలు రెచ్చిపోరని... శ్రేణులు - ప్రజలతో సయోధ్యతో ఉంటారని.. ఓడిపోతామన్న భయం మొదలైనప్పుడే ఇలా జరుగుతుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.