Begin typing your search above and press return to search.
ఏపీ మండలిలో బలాబలాలు ఇలా ఉన్నాయ్
By: Tupaki Desk | 21 Jan 2020 11:10 AM ISTఏపీ రాజధాని వికేంద్రీకరణ బిల్లు శాసనమండలికి వచ్చింది. శాసనసభలో ఆమోదం పొందిన ఈ బిల్లు మండలికి చేరుకుంది. అక్కడ ఆమోదం పొందితే ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. ఏపీకి మూడు రాజధానులకు అలా రాజముద్ర పడనుంది.
అయితే ఇక్కడే తిరకాసు ఉంది. ఏపీ మండలిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. మండలిలో వైసీపీకి కేవతం 9 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 30 మందికి పైగా ఎమ్మెల్సీలున్నారు. అలా శాసనమండలిలో తెలుగుదేశం మెజారిటీ గా ఉంది.
ఇక పీడీఎఫ్ సభ్యులు ఐదు మంది ఉన్నారు. వీరు గాక బీజేపీ సభ్యులు ఇద్దరు - కాంగ్రెస్ ఒకరు - ఇతర ఇండిపెండెంట్ లు ఉన్నారు. ఇలా మండలిలో వైసీపీ మైనారిటీగా ఉంది.
ఈ నేపథ్యంలో మండలిలో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు తక్కువగా ఉన్నట్టే. అయితే ఏం జరుగుతుందనేది మాత్రం ఆసక్తిదాయకమే. మండలిలో ఈ బిల్లు ఆమోదం పొందకపోయినా.. దాన్ని అమలు చేయడానికి శాసనసభకు అవకాశం ఉంటుంది. మరోసారి సభ ఆ బిల్లును ఆమోదించి మండలికి పంపవచ్చు. ఆ తర్వాత మూడు నెలల్లో మండలి ఆ బిల్లును ఆమోదించినా, ఆమోదించకపోయినా.. అది కార్యరూపం అయితే దాలుస్తుంది.
అంత వరకూ వెయిటింగ్ అవసరం లేకుండా.. ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కూడా ఏపీ ప్రభుత్వానికి ఉంటుంది.
అయితే ఇక్కడే తిరకాసు ఉంది. ఏపీ మండలిలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం లేదు. మండలిలో వైసీపీకి కేవతం 9 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి 30 మందికి పైగా ఎమ్మెల్సీలున్నారు. అలా శాసనమండలిలో తెలుగుదేశం మెజారిటీ గా ఉంది.
ఇక పీడీఎఫ్ సభ్యులు ఐదు మంది ఉన్నారు. వీరు గాక బీజేపీ సభ్యులు ఇద్దరు - కాంగ్రెస్ ఒకరు - ఇతర ఇండిపెండెంట్ లు ఉన్నారు. ఇలా మండలిలో వైసీపీ మైనారిటీగా ఉంది.
ఈ నేపథ్యంలో మండలిలో ఈ బిల్లు ఆమోదం పొందే అవకాశాలు తక్కువగా ఉన్నట్టే. అయితే ఏం జరుగుతుందనేది మాత్రం ఆసక్తిదాయకమే. మండలిలో ఈ బిల్లు ఆమోదం పొందకపోయినా.. దాన్ని అమలు చేయడానికి శాసనసభకు అవకాశం ఉంటుంది. మరోసారి సభ ఆ బిల్లును ఆమోదించి మండలికి పంపవచ్చు. ఆ తర్వాత మూడు నెలల్లో మండలి ఆ బిల్లును ఆమోదించినా, ఆమోదించకపోయినా.. అది కార్యరూపం అయితే దాలుస్తుంది.
అంత వరకూ వెయిటింగ్ అవసరం లేకుండా.. ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కూడా ఏపీ ప్రభుత్వానికి ఉంటుంది.
