Begin typing your search above and press return to search.
డీల్ కుదిరింది.. ఎయిర్ఇండియాను కొనబోతున్న టాటా గ్రూప్..!
By: Tupaki Desk | 15 Dec 2020 12:12 PM ISTభారీనష్టాల్లో ఉన్న ఎయిర్ఇండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేయనున్నట్టు సమాచారం. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నష్టాల పేరుచెప్పి వరసగా ప్రభుత్వ రంగ సంస్థలను ధారాదత్తం చేస్తోంది. దేశంలోని ప్రజాస్వామికవాదులు, ఉద్యోగసంఘాలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నప్పటికీ కేంద్రం మాత్రం మొండిగా ముందుకు వెళ్తున్నది. దేశంలోని అన్ని కంపెనీలను ప్రైవేట్ పరం చేసేందుకే ఆసక్తి చూపుతున్నది. తాజాగా ఎయిర్ ఇండియా ను టాటాకు కట్టబెట్టనున్నట్టు సమాచారం.
ఇందు కోసం టాటా గ్రూప్ బిడ్ దాఖలు చేసింది. ఈవోఐకు ఇవాళ్టి సాయంత్రం గడువు ముగిసింది. దీంతో టాటా సన్స్ చివరి రోజు ఈవోఐ ను దాఖలు చేసింది. ఈ బిడ్ అర్హత సాధిస్తే రానున్న 15 రోజుల్లో ఫైనాన్షియల్ బిడ్ను సమర్పించే అవకాశం ఉంది. అయితే టాటాగ్రూప్ ఒంటరిగానే కొనుగోలు చేస్తందా.. ఇతర కంపెనీ ల భాగస్వామ్యం తో కలసి వెళ్తుందా అనే విషయం పై క్లారిటీ లేదు. నిజానికి ఎయిర్ ఇండియా ను స్థాపించింది టాటా గ్రూపే. 1932 లో టాటా గ్రూప్ టాటా ఎయిర్ లైన్స్ ఈ సంస్థ ను ప్రారంభించింది. కానీ 1946లో ఎయిరిండియా గా మారింది. 1953లో ప్రభుత్వం తీసుకున్నది.
దాదాపు 67 ఏళ్ల తర్వాత టాటా గ్రూపే మళ్లీ ఈ సంస్థను కైవసం చేసుకుంటున్నది. మరోవైపు ఎయిరిండియాకు చెందిన 209 మంది ఉద్యోగుల గ్రూప్ 51శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబర్చింది. ఈ బిడ్కు ప్రస్తుత ఎయిరిండియా కమర్షియల్ డైరెక్టర్ మీనాక్షీ మల్లిక్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించారు. గతంలోనూ ఎయిర్ఇండియాను ప్రైవేట్పరం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏ సంస్థ ముందుకు రాలేదు.
ఇందు కోసం టాటా గ్రూప్ బిడ్ దాఖలు చేసింది. ఈవోఐకు ఇవాళ్టి సాయంత్రం గడువు ముగిసింది. దీంతో టాటా సన్స్ చివరి రోజు ఈవోఐ ను దాఖలు చేసింది. ఈ బిడ్ అర్హత సాధిస్తే రానున్న 15 రోజుల్లో ఫైనాన్షియల్ బిడ్ను సమర్పించే అవకాశం ఉంది. అయితే టాటాగ్రూప్ ఒంటరిగానే కొనుగోలు చేస్తందా.. ఇతర కంపెనీ ల భాగస్వామ్యం తో కలసి వెళ్తుందా అనే విషయం పై క్లారిటీ లేదు. నిజానికి ఎయిర్ ఇండియా ను స్థాపించింది టాటా గ్రూపే. 1932 లో టాటా గ్రూప్ టాటా ఎయిర్ లైన్స్ ఈ సంస్థ ను ప్రారంభించింది. కానీ 1946లో ఎయిరిండియా గా మారింది. 1953లో ప్రభుత్వం తీసుకున్నది.
దాదాపు 67 ఏళ్ల తర్వాత టాటా గ్రూపే మళ్లీ ఈ సంస్థను కైవసం చేసుకుంటున్నది. మరోవైపు ఎయిరిండియాకు చెందిన 209 మంది ఉద్యోగుల గ్రూప్ 51శాతం వాటాను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబర్చింది. ఈ బిడ్కు ప్రస్తుత ఎయిరిండియా కమర్షియల్ డైరెక్టర్ మీనాక్షీ మల్లిక్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించారు. గతంలోనూ ఎయిర్ఇండియాను ప్రైవేట్పరం చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏ సంస్థ ముందుకు రాలేదు.
